E-Paper
Advertisement

Crime: మహిళ స్నానం చేస్తుండగా ఫొటోలు తీసి బెదిరింపులు.. పలుమార్లు అత్యాచారం.. చివరికి

Crime: మహిళ స్నానం చేస్తుండగా ఫొటోలు తీసి బెదిరింపులు.. పలుమార్లు అత్యాచారం.. చివరికి
Advertisement

Crime: మహిళలపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహిళా భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దాడులు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొందరు కేటుగాళ్లు రెచ్చిపోయి మహిళలను వేధిస్తున్నారు. విజయవాడలో ఓ కేటుగాడు మహిళ స్నానం చేస్తుండగా దొంగచాటుగా ఫొటోలు, వీడియోలు తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. పలుమార్లు అత్యాచారం చేశాడు. బెదిరించి ఆమె నుంచి లక్షల రూపాయలు తీసుకున్నాడు. మహిళ తిరిగి ఇవ్వాలని అడగడంతో.. ఆమెను చితకబాదాడు.

రాజీవ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ శాంతి నగర్‌లో కిరాణా షాపు నడుపూ జీవనం సాగిస్తుంది. అదే కాలనీకి చెందిన పుట్టా సుభాష్ అనే వ్యక్తి పలుమార్లు సరుకుల కోసం వారి దుకాణానికి వెళ్లాడు. సరుకుల డబ్బులను ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా పంపించి ఆమె నెంబర్‌ను సంపాదించాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత.. ఆమె ఇంటి దగ్గర స్నానం చేస్తుంది చూసి.. ఫొటోలు, వీడియోలు తీశాడు.

Advertisement

వాటిని ఆమెకు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. తాను చెప్పినట్లు వినాలని.. లేదంటే వీడియోలు సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించాడు. ఆపై పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఏడాది పాటు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అలాగే ఆమె దగ్గరి నుంచి రూ. 16 లక్షలు తీసుకున్నాడు. ఇటీవల మహిళ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడంతో.. ఆమెపై దాడి చేసి చితకబాదాడు. డబ్బులు తిరిగి ఇవ్వనని తేల్చిచెప్పాడు.

ఈక్రమంలో చేసేది ఏమీ లేక.. అతని వేధింపులు తట్టుకోలేక బాధిత మహిళ జరిగిన విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపింది. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సుభాష్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Tags

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×