E-Paper
Advertisement

Chandrababu Convoy: కాన్వాయ్ వెంట పరుగులు తీసిన మహిళ.. కారు ఆపి మాట్లాడిన చంద్రబాబు!

Chandrababu Convoy: కాన్వాయ్ వెంట పరుగులు తీసిన మహిళ.. కారు ఆపి మాట్లాడిన చంద్రబాబు!

Woman Ran Along The Convoy to See Chandra Babu: ఎన్డీఏ పక్ష నాయకుడిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడిని చూసేందుకు కాన్వాయ్ వెంట ఓ మహిళ పరుగులు తీసింది. ఇది గమనించిన చంద్రబాబు తన కాన్వాయ్ ను ఆపి ఆమెతో ఆప్యాయంగా మాట్లాడారు. ‘నాకు జ్వరం వచ్చినా మీరు వస్తున్నారని తెలిసి.. మిమ్మల్ని చూసేందుకు వచ్చాను సార్’ అంటూ ఆ మహిళ చెప్పడంతో చలించిపోయారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి, అవసరమైన వైద్య సదుపాయం అందేలా చూడాలని పార్టీ నేతలకు బాబు సూచించారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

నగరంలోని ఏ-కన్వెన్షన్‌ హాలులో కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు హాజరయ్యారు. బాబును చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు. సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు ఉండవల్లికి ప్రయాణమయ్యారు. బాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. ఆ మహిళను కారులోంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ను ఆపి మరి, ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడారు. తనది మదనపల్లి అని, తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ చంద్రబాబుతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడింది. మీపై ఉన్న అభిమానంతో చూడడానికి వచ్చానంటూ చంద్రబాబుకు చెబుతూ ఆనందం వ్యక్తం చేసింది. తనను చూసి ఎమోషన్ అయిన ఆ మహిళతో చంద్రబాబు మాట్లాడారు. సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు. ‘మా కష్టం ఫలించి.. మా కోరిక మేరకు మీరు సీఎం అయ్యారు సార్.. ఒక్కసారి మీ కాళ్లు మొక్కుతాను’ అంటూ ఆ మహిళ అనగా.. చంద్రబాబు సున్నితంగా వారించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫొటో తీసుకున్నారు.

Also Read: చిరంజీవికి ప్రత్యేకంగా చంద్రబాబు ఇన్విటేషన్, సాయంత్రం విజయవాడకు..

‘నాకు జ్వరం వచ్చినా మిమ్మల్ని చూసేందుకు వచ్చాను సార్’ అంటూ చంద్రబాబుతో ఆ మహిళ చెప్పగా.. చలించిపోయిన చంద్రబాబు ముందు ఆసుపత్రికి వెళ్లమ్మ అంటూ సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని, అవసరమైన వైద్యం సాయం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×