Big Stories

Chandrababu Convoy: కాన్వాయ్ వెంట పరుగులు తీసిన మహిళ.. కారు ఆపి మాట్లాడిన చంద్రబాబు!

Woman Ran Along The Convoy to See Chandra Babu: ఎన్డీఏ పక్ష నాయకుడిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడిని చూసేందుకు కాన్వాయ్ వెంట ఓ మహిళ పరుగులు తీసింది. ఇది గమనించిన చంద్రబాబు తన కాన్వాయ్ ను ఆపి ఆమెతో ఆప్యాయంగా మాట్లాడారు. ‘నాకు జ్వరం వచ్చినా మీరు వస్తున్నారని తెలిసి.. మిమ్మల్ని చూసేందుకు వచ్చాను సార్’ అంటూ ఆ మహిళ చెప్పడంతో చలించిపోయారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి, అవసరమైన వైద్య సదుపాయం అందేలా చూడాలని పార్టీ నేతలకు బాబు సూచించారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

- Advertisement -

నగరంలోని ఏ-కన్వెన్షన్‌ హాలులో కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు హాజరయ్యారు. బాబును చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు. సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు ఉండవల్లికి ప్రయాణమయ్యారు. బాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. ఆ మహిళను కారులోంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ను ఆపి మరి, ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడారు. తనది మదనపల్లి అని, తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ చంద్రబాబుతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడింది. మీపై ఉన్న అభిమానంతో చూడడానికి వచ్చానంటూ చంద్రబాబుకు చెబుతూ ఆనందం వ్యక్తం చేసింది. తనను చూసి ఎమోషన్ అయిన ఆ మహిళతో చంద్రబాబు మాట్లాడారు. సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు. ‘మా కష్టం ఫలించి.. మా కోరిక మేరకు మీరు సీఎం అయ్యారు సార్.. ఒక్కసారి మీ కాళ్లు మొక్కుతాను’ అంటూ ఆ మహిళ అనగా.. చంద్రబాబు సున్నితంగా వారించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫొటో తీసుకున్నారు.

- Advertisement -

Also Read: చిరంజీవికి ప్రత్యేకంగా చంద్రబాబు ఇన్విటేషన్, సాయంత్రం విజయవాడకు..

‘నాకు జ్వరం వచ్చినా మిమ్మల్ని చూసేందుకు వచ్చాను సార్’ అంటూ చంద్రబాబుతో ఆ మహిళ చెప్పగా.. చలించిపోయిన చంద్రబాబు ముందు ఆసుపత్రికి వెళ్లమ్మ అంటూ సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని, అవసరమైన వైద్యం సాయం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News