E-Paper
Advertisement

Krishna Statue : బుర్రిపాలెం బుల్లోడు కృష్ణ విగ్రహవిష్కరణ.. పాల్గొన్న లోకనాయకుడు

Krishna Statue : బుర్రిపాలెం బుల్లోడు కృష్ణ విగ్రహవిష్కరణ.. పాల్గొన్న లోకనాయకుడు
Advertisement

Krishna Statue : సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని విజయవాడలో అట్టహాసంగా ఆవిష్కరించారు. సినీనటుడు కమలహాసన్ చేతులమీదుగా ఈ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. విజయవాడలోని గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ దేవినేని అవినాష్‌తో కలిసి కమల్ హాసన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలుగు ప్రజలందరి అభిమాన నటుడైన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం ఆనందంగా ఉందని దేవినేని అవినాష్‌ అన్నారు. తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన నటుడు కృష్ణగా అభివర్ణించారు. ఆయన వారసత్వంతో ఇండస్ట్రీ లోకి వచ్చిన మహేష్ బాబు అటు సినీరంగంలో, ఇటు సేవ కార్యక్రమాలలో ముందుంటూ కృష్ణ పేరు నిలబెడుతున్నారన్నారు. షూటింగ్‌లో బిజీగా ఉండే కమల్ హాసన్ ఇక్కడకు రావడం సంతోషంగా ఉందన్నారు.

Advertisement

గతేడాది నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ తనువుచాలించారు. ఆయన భౌతికంగా లేకపోయినా.. అభిమానులు ఆయన్ను మరిచిపోలేక శిలారూపంలోనైనా ఉండాలని భావించి విగ్రహావిష్కరణలు చేస్తున్నారు. ఇటీవలే కృష్ణ స్వస్థలం అయిన బుర్రిపాలెంలోనూ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. కాగా.. లోకనాయకుడిగా పేరుపొందిన కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2, థగ్ లైఫ్, కల్కి సినిమాలతో బిజీగా ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఇండియన్ 2 షూటింగ్ ప్రస్తుతం విజయవాడలోనే జరుగుతోంది.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×