BigTV English

Amaravati Assigned Land case : అమరావతి అసైన్డ్ భూముల కేసు రీ ఓపెన్.. మళ్లీ వాయిదా?

Amaravati Assigned Land case : అమరావతి అసైన్డ్ భూముల కేసు రీ ఓపెన్.. మళ్లీ వాయిదా?

Amaravati Assigned Land case : ఏపీ హైకోర్టులో కీలక పిటిషన్ పై విచారణ జరిగింది. రాజధాని పేరుతో భూముల అవకతవకలకు పాల్పడ్డారని దాఖలైన పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారించింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, నారాయణ అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ కేసు నమోదు చేసింది.


అసైన్ డ్ భూములకు సంబంధించి చంద్రబాబు, నారాయణలపై 2021లో కేసు నమోదు చేయగా ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం నేటికి తీర్పును రిజర్వ్ చేసింది. అసైన్డ్ భూముల విషయంలో తాము ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదని పేర్కొంటూ కేసును కొట్టేయాలని గతంలోనే కోర్టులో నారాయణ, చంద్రబాబు పిటిషన్లు వేయగా వాటి పైన విచారించిన హైకోర్టు నేడు తీర్పును వెలువరిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ.. అసైన్డ్ భూముల కేసు వ్యవహారంలో కొత్త ఆధారాలను పరిగణలోకి తీసుకుని విచారించాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.

సీఐడీ సమర్పించిన కొత్త ఆధారాలను పరిశీలించిన కోర్టు.. కేసు రీ ఓపెన్ కు ఏమైనా అభ్యంతరాలుంటే ప్రతివాదులు కౌంటర్ వేయాలని ఆదేశించింది. అక్టోబర్ 17న మరిన్ని వీడియో ఆధారాలను అందజేస్తామని సీఐడీ తెలుపగా.. తదుపరి విచారణను నవంబర్ 1కి వాయిదా వేసింది.


Related News

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Jagan Assembly: ఈ మాస్ ర్యాగింగ్ ని జగన్ తట్టుకోగలరా? వైసీపీ వ్యూహం ఏంటి?

Dasara 2025: దసరా సంబరాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు

Vijayawada Durga Festival: 10,000 సీసీ కెమెరాలతో.. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు భారీ బందోబస్తు

Big Stories

×