E-Paper
Advertisement

Amaravati Assigned Land case : అమరావతి అసైన్డ్ భూముల కేసు రీ ఓపెన్.. మళ్లీ వాయిదా?

Amaravati Assigned Land case : అమరావతి అసైన్డ్ భూముల కేసు రీ ఓపెన్.. మళ్లీ వాయిదా?
Advertisement

Amaravati Assigned Land case : ఏపీ హైకోర్టులో కీలక పిటిషన్ పై విచారణ జరిగింది. రాజధాని పేరుతో భూముల అవకతవకలకు పాల్పడ్డారని దాఖలైన పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారించింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, నారాయణ అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ కేసు నమోదు చేసింది.

అసైన్ డ్ భూములకు సంబంధించి చంద్రబాబు, నారాయణలపై 2021లో కేసు నమోదు చేయగా ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం నేటికి తీర్పును రిజర్వ్ చేసింది. అసైన్డ్ భూముల విషయంలో తాము ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదని పేర్కొంటూ కేసును కొట్టేయాలని గతంలోనే కోర్టులో నారాయణ, చంద్రబాబు పిటిషన్లు వేయగా వాటి పైన విచారించిన హైకోర్టు నేడు తీర్పును వెలువరిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ.. అసైన్డ్ భూముల కేసు వ్యవహారంలో కొత్త ఆధారాలను పరిగణలోకి తీసుకుని విచారించాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.

Advertisement

సీఐడీ సమర్పించిన కొత్త ఆధారాలను పరిశీలించిన కోర్టు.. కేసు రీ ఓపెన్ కు ఏమైనా అభ్యంతరాలుంటే ప్రతివాదులు కౌంటర్ వేయాలని ఆదేశించింది. అక్టోబర్ 17న మరిన్ని వీడియో ఆధారాలను అందజేస్తామని సీఐడీ తెలుపగా.. తదుపరి విచారణను నవంబర్ 1కి వాయిదా వేసింది.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×