BigTV English
Advertisement

CM Chandrababu: 1995లోనే ఐటీని తెచ్చా.. హైదరాబాద్ బెస్ట్ సిటీ.. డ్రోన్స్ కంపెనీలకు స్వాగతం పలుకుతున్నా.. సీఎం చంద్రబాబు

CM Chandrababu: 1995లోనే ఐటీని తెచ్చా.. హైదరాబాద్ బెస్ట్ సిటీ.. డ్రోన్స్ కంపెనీలకు స్వాగతం పలుకుతున్నా.. సీఎం చంద్రబాబు

CM Chandrababu: దేశంలోనే అతిపెద్ద డ్రోన్ సమ్మిట్ ఏపీలో నిర్వహించడం తనకు గర్వంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో రెండ్రోజులపాటు జరగనున్న డ్రోన్ సమ్మిట్-2024ను సీఎం చంద్రబాబు మంగళవారం ప్రారంభించారు. డ్రోన్ సమ్మిట్ కు కేంద్రమంత్రి రామ్మోహన్, మంత్రులు బీసీ జనార్థన్ రెడ్డి, అనిత, అచ్చెన్నాయుడు, సంధ్యారాణి పలువురు హాజరయ్యారు. ఈ డ్రోన్ సమ్మిట్ లో 521 పైగా కంపెనీలకు చెందిన 6,929 మంది ప్రతినిధులు [పాల్గొన్నారు. ఏపీని డ్రోన్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం


ఈ సంధర్భంగా సీఎం మాట్లాడుతూ.. శంలోనే అతిపెద్ద డ్రోన్ సమ్మిట్ ఏపీలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. టెక్నాలజీలో భారత్ దూసుకుపోతోందని, ప్రతి ఒక్కరూ వికసిత్ భారత్-2047 లక్ష్యంగా పని చేయాలన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ డైనమిక్ ప్రైమ్ మినిస్టర్ అంటూ కొనియాడిన చంద్రబాబు.. దేశం ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొనేందుకు కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తుందన్నారు. అందుకే డ్రోన్ నిబంధనలను కేంద్రం సులభతరం చేసిందన్నారు. మనం ఇప్పటికే సాంకేతిక పరిజ్ఞాన పరంగా అడ్వాన్స్ డ్రోన్స్, మొబైల్ ఫోన్స్, శాటిలైట్ అధునాతన వ్యవస్థను కలిగి ఉన్నామన్నారు.

భవిష్యత్ లో డ్రోన్స్.. గేమ్ ఛేంజర్స్..
భవిష్యత్ లో డ్రోన్స్ గేమ్ ఛేంజర్స్ లా తయారవుతాయని సీఎం జోస్యం చెప్పారు. ఇప్పటికే డ్రోన్స్ లను బాంబులు విసిరేందుకు కూడా పలు దేశాలు ఉపయోగిస్తున్నాయన్నారు. అయితే మన దేశం మాత్రం డ్రోన్స్ ను ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తుందన్నారు. ఇటీవల విజయవాడ వరదల సమయంలో డ్రోన్స్ సేవలు మరువలేనివన్నారు. హెలికాప్టర్ సాయంతో తాము అన్నం ప్యాకెట్లను, భాదితులకు చేరవేసే ప్రయత్నం చేస్తే.. అవి సరైన రీతిలో అందలేదన్నారు. అదే డ్రోన్స్ సాయంతో అన్నం ప్యాకెట్లు చెక్కుచెదరకుండా అందాయని, 150000 మంది భాదితులకు డ్రోన్స్ సాయం చేశాయన్నారు. అలాగే నేటి రోజుల్లో వ్యవసాయ రంగానికి డ్రోన్స్ ఉపయోగపడుతున్నాయని, నేరాల నియంత్రణ, ప్రజా రక్షణలో వీటి పాత్ర ప్రధానంగా కనిపిస్తోందన్నారు.


Also Read: UnstoppableS4 Promo: ఆట మొదలైంది.. సీఎంతో మామూలుగా ఉండదు..!

హైదరాబాద్ దేశంలోనే బెస్ట్ సిటీ..
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం ది బెస్ట్ సిటీ ఇన్ ఇండియా అంటూ చంద్రబాబు అన్నారు. 1995 లోనే తాను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐటీ గురుంచి ఆలోచించానన్నారు. మైక్రోసాఫ్ట్ తో పాటు చాలా కంపెనీలను హైదరాబాద్ కు తీసుకువచ్చామన్నారు. అదే రీతిలో ఇప్పుడు ఏపీ అభివృద్ది బాటలో నడిచేందుకు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని, కంపెనీలకు తాము ఎప్పటికీ స్వాగతిస్తామన్నారు. డ్రోన్స్ తయారీ కంపెనీలకు ఏపీ ఒక కేంద్రంలా మార్చడమే తన ముందున్న లక్ష్యమన్నారు. ఇలా డ్రోన్ సమ్మిట్ ప్రారంభం కాగా, అధునాతన టెక్నాలజీ గల డ్రోన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సమ్మిట్ విజయవంతమయ్యేందుకు కృషి చేసిన అధికారులను, సమ్మిట్ కు హాజరైన కంపెనీల ప్రతినిధులను బాబు అభినందించారు.

Related News

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

Big Stories

×