E-Paper
Advertisement

Ambati Rambabu: అంబటి చిక్కు ప్రశ్న.. మంత్రి లోకేష్ ఎలా రియాక్ట్ అవుతారో?

Ambati Rambabu: అంబటి చిక్కు ప్రశ్న.. మంత్రి లోకేష్ ఎలా రియాక్ట్ అవుతారో?

Ambati Rambabu: వైసీపీ నేత అంబటి రాంబాబు రూటు మార్చారా? రాజకీయాలను పక్కన పెట్టేసి చంద్రబాబు సర్కార్‌ని ప్రశ్నించడం మొదలుపెట్టారా? సీఎంని ఉక్కిరి బిక్కిరి చేసేందుకు కొత్త అస్త్రాన్ని ప్రయోగించారా? దీనిపై ముఖ్యమంత్రి ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి. ఇంతకీ అంబటి సంధించిన ప్రశ్న ఏంటి?

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి అంబటి రాంబాబు గురించి చెప్పనక్కర్లేదు. ఏ విషయమైనా సూటిగా, సుత్తి లేకుండా చెప్పేస్తారు.. లేకుంటే ప్రశ్నిస్తారు. ఆయన రాజకీయాలను పక్కన పెట్టేశారో ఏమోగానీ సీఎం చంద్రబాబును ఇరకాటంలో పెట్టాలని డిసైడ్ అయ్యారు. కామన్ జెండాను పట్టుకుని అస్త్రాన్ని సంధించారు. అంబటి ప్రశ్నపై ముఖ్యమంత్రి రియాక్ట్ అవుతారన్నది అసలు ప్రశ్న.

ఈ మధ్యకాలంలో జనాభాను పెంచాలని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు.  జననాలు తగ్గిపోవడం వల్ల రాబోయే రోజుల్లో ఊహించని పరిస్థితులు ఏర్పడుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఐరోపా దేశాలు అలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పారు. జరిగిన.. జరుగుతున్న పరిణామాలను గురించి చైనా, ఆయా పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు.

సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రకటనలపై దృష్టి పెట్టారు అంబటి రాంబాబు. మార్పు అనేది మన దగ్గర నుంచి మొదలుకావాలని, ఈ విషయంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ‘‘నువ్వు మీ నాన్నకి ఒక్కడివి.. నీకు ఒక్కడు’’. దేశంలో ఉన్నజనాభాను పిల్లలను కనాలని చెబుతారని, నువ్వు మాత్రం ఒక్కరినే ఎందుకు కన్నారని ప్రశ్నించారు.

ALSO READ: వైనాట్ కుప్పం.. వైనాట్ పులివెందుల

అంబటి రాంబాబు ప్రశ్నపై చాలామంది ఆలోచనలో పడ్డారు. ఆయన ప్రశ్నను సమర్థించేవారు కొందరైతే.. వ్యతిరేకించేవారు ఇంకొందరు.  మార్పు అనేది మన నుంచి మొదలుకావాలని అంటున్నారు. ఆరోగ్య సమస్యల వల్ల చాలామంది ఒక్కరే చాలని డిసైడ్ అయ్యారని మరికొందరు అంటున్నారు.  ఇప్పటికే చాలామందికి పిల్లలు పుట్టక రకరకాల పద్దతులను అవలంభిస్తున్నారని గుర్తు చేస్తున్నారు.

అంబటి ప్రశ్నకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఏ విధంగా సమాధానం ఇస్తారో చూడాలి.  జనాభా తగ్గడం వల్ల వచ్చే సమస్యలు అన్నీఇన్నీ కావు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వెనుకాడుతారు. దానివల్ల యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లుతాయి. నిరుద్యోగం తాండవిస్తోందని గుర్తు చేస్తున్నారు నిపుణులు.

చైనాతోపాటు చాలా దేశాలు గతంలో కేవలం ఒక్కరితో సరిపెట్టుకుంటున్నారు. దాని పరిణామాలు తెలిసిన తర్వాత పిల్లలను కనేందుకు ప్రొత్సాహకాలు ఇస్తున్నారని గుర్తు చేస్తున్నారు. అయితే పెరుగుతున్న ఖర్చులు, ఉద్యోగం భయం కారణంగా ఒక్కరితో సరిపెడుతున్నట్లు అంటున్నవాళ్లు లేకపోలేదు.

 

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×