E-Paper
Advertisement

Ambati Rambabu Comments: పల్నాడు హింసకు చంద్రబాబే కారణం: మంత్రి అంబటి

Ambati Rambabu Comments: పల్నాడు హింసకు చంద్రబాబే కారణం: మంత్రి అంబటి
Advertisement

Minister Ambati Rambabu on Palnadu Incident: ఏపీలోని పల్నాడులో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన అల్లర్లకు కారణం  టీడీపీ అధినేత చంద్రబాబు అని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పల్నాడు నియోజకవర్గంలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ జరుపుతున్న సిట్ బృందాన్ని కలిసిన మంత్రి పలు అంశాలను వారికి వివరించారు. అంతే కాకుండా పోలీసులు, ప్రతిపక్ష నేతల తీరుపై ఫిర్యాదు చేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్ రోజు పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలం అయిందని అన్నారు. ఎన్నికల్లో ఒడిపోతామనే భయంతో చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. దాడుల వెనక చంద్రబాబు, పవన్, పురందేశ్వరి ఉన్నారన్న అనుమానాలు ఉన్నాయని తెలిపారు. పోలింగ్, పోలీసు సిబ్బంది కొందరు డబ్బులకు అమ్ముడు పోయారని అన్నారు. తాను సత్తెనపల్లి నుంచి మూడు సార్లు పోటీ చేశానని.. ఎన్నడూ హింసాత్మక సంఘటనలు చూడలేదని తెలిపారు

Advertisement

పల్నాడు, తాడిపత్రిలో అధికారులను మార్చిన చోటే హింస చెలరేగిందని అన్నారు. ఈవీఎంలు పగల గొట్టాలనే ఉద్ధేశంతోనే దాడులు చేశారని తెలిపారు. పురందేశ్వరి ఎక్కడైతే ఫిర్యాదుతో అధికారులను మార్చారో అక్కడే హింస జరిగిందని అన్నారు. కూటమి నేతలు కలిసి కుట్రలు చేశారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ నియమించిన అధికారులను సస్పెండ్ చేశారని తెలిపారు.

Also Read: చరిత్రలోనే తొలిసారి.. ఏపీ పోలీసులపై కొనసాగుతున్న సిట్ విచారణ..

Advertisement

సత్తెనపల్లి నియోజకవర్గంలో కూటమి నేతలు పోలింగ్ బూత్ లను ఆక్రమించి దొంగ ఓట్లు వేశారని మండిపడ్డారు. హింసాత్మక ఘటనల్లో తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిట్ అధికారులను కోరినట్లు వెల్లడించారు. కూటమి నేతల భయంతో కొండాపిలిలో ముస్లింలు ఇళ్లు వదిలి వెళ్లిపోయారని చెప్పారు. గ్రామాలను విడిచి వెళ్లిన వారిని తిరిగి రప్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మరో సారి వైసీపీ గెలుపు ఖాయమన్నారు.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×