BigTV English
Advertisement

Annadatta Sukhibhava: అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ స్కీమ్ అప్‌డేట్స్.. వారణాసిలో ప్రధాని, ఒంగోలులో సీఎం చంద్రబాబు

Annadatta Sukhibhava: అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ స్కీమ్ అప్‌డేట్స్.. వారణాసిలో ప్రధాని, ఒంగోలులో సీఎం చంద్రబాబు

Annadatta Sukhibhava: రైతులకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త చెప్పాయి. రైతులు ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకానికి సంబంధించి నిధులు విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 2న వారణాసిలో ప్రధాని నరేంద్ర‌మోడీ పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నారు. అదే రోజున ఏపీ అంతటా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు పడనున్నాయి.


పీఎం కిసాన్ నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు తీపి కబురు వచ్చేసింది. 20వ విడత డబ్బులు ఆగస్టు 2న విడుదల కానున్నాయి. ఆరోజు వారణాసి పర్యటనకు పీఎం నరేంద్రమోదీ వెళ్తున్నారు. అదే రోజు ఆయా నిధులను విడుదల చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా మూడు విడతల్లో 6000 వేల రూపాయలు విడుదల చేస్తోంది.

అదే రోజు ఆగస్టు 2న ఏపీలో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయనుంది కూటమి సర్కార్. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు కలిపి 7 వేల రూపాయలు రైతుల ఖాతాలో పడనున్నాయి. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చేది 6000 రూపాయలు, అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం వాటా 14 వేల రూపాయలు కలిపి మొత్తం 20వేల రూపాయలను మూడు విడతల్లో జమ చేయనుంది ఏపీ ప్రభుత్వం.


కౌలు రైతులకు ఆయా నిధులు విడుదల కావు. ఎందుకంటే వారికి పీఎం కిసాన్ స్కీమ్ ఉండదు. అందువల్ల 14 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెండో విడతలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇక అన్నదాత సుఖీభవ పథకం 40.64 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది.

ALSO READ: ఏపీ లిక్కర్ కేసు.. ఫామ్ హౌస్‌ని రౌండప్ చేసిన సిట్, రూ.11 కోట్లు సీజ్

అన్నదాత సుఖీభవ పథకం 40.64 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది. అయితే ఇప్పటికే దాదాపు 46.20 లక్షల మంది ఈ-కేవైసీ పూర్తి చేశారు. 40,364 మంది మాత్రమే ఈ-కేవైసీ పెండింగ్ ఉన్నట్లు సమాచారం.

అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతులు తమ స్టేటస్‌ని తెలుసుకునేందుకు కింద ఇవ్వబడిన వెబ్ సైట్ లేదా యాప్‌లో ఆధార్ సహాయంతో చెక్ చేసుకోవచ్చు. తొలుత https://annadathasukhibhava.ap.gov.in/ లింకు క్లిక్ చేయాలి. వెబ్‌సైట్‌లోకి వెళ్లగానే మీకు know your status అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఆధార్ సాయంతో వివరాలు తెలుకోవచ్చు.

Related News

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

Big Stories

×