BigTV English

Kidnap Case : ఆ వ్యాపారులే టార్గెట్.. విశాఖలో మరోసారి కిడ్నాప్ కలకలం..

Kidnap Case : ఆ వ్యాపారులే టార్గెట్.. విశాఖలో మరోసారి కిడ్నాప్ కలకలం..

Kidnap Case : విశాఖలో వరుస కిడ్నాప్ లు కలకలం రేపుతున్నాయి. కొన్నిరోజుల క్రితం వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు, ఓ ఆడిటర్ కిడ్నాప్ నకు గురయ్యారు. ఈ వ్యవహారం సుఖాంతమైన పెను రాజకీయ దుమారాన్నే రేపింది. ఎంపీ ఫ్యామిలీకే రక్షణ లేదంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఆ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరోసారి విశాఖలో మరో కిడ్నాప్ ఉదంతం వెలుగు చూసింది.


రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న దంపతులను దుండగులు కిడ్నాప్ చేశారు. విజయవాడకు చెందిన శ్రీనివాస్‌, లోవ లక్ష్మి దంపతులు 4 నెలల క్రితం నగరానికి వచ్చారు.నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్నారు. ఆ దంపతులను దుండగులు కిడ్నాప్ చేశారు. రూ.60 లక్షలు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారని బాధితుల బంధువులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.ఈ కిడ్నాప్‌ వ్యవహారాన్ని చాకచక్యంగా చేధించారు.

కాకినాడ జిల్లా అన్నవరం మండలం కత్తిపూడి వద్ద ఓ కారును పోలీసులు అడ్డుకున్నారు. అందులో ఉన్న ఐదుగురు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్లను విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. శ్రీనివాస్‌, అతడి భార్య లక్ష్మి సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు.


మరోవైపు కిడ్నాప్ నకు గురైన శ్రీనివాస్‌పై గతంలో విజయవాడ పడమటలో కేసు ఉంది. చీటింగ్‌ కేసులో జూన్‌ 2021లో శ్రీనివాస్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.3 కోట్లు కాజేశారని అప్పట్లో కేసు నమోదైంది. కిడ్నాప్‌ వ్యవహారంలో మరో రియల్టర్ సంస్థ ప్రమేయం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

AP Heavy Rains: ఏపీకి అల్పపీడనం ముప్పు.. భారీ వర్షాలు పడే అవకాశం, రెడీగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్

Big Stories

×