BigTV English
Advertisement

Who is game changer in AP: ఏపీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ ఎవరు?

Who is game changer in AP: ఏపీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ ఎవరు?

Ap elections 2024 result updates(Political news in AP): ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో టీడీపీకి పట్టంకట్టారు ఓటర్లు. కూటమి గెలుపు వెనుక అన్నిరకాల వర్గాల ప్రజలు ఉన్నారు. యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్ వాళ్లు పోషించిన పాత్ర మరువలేము. ఇంతవరకు ఓకే. మరి ఈ గెలుపు వెనుక విజయం ఎవరిది? టీడీపీ అధినేత చంద్రబాబుకు దక్కుతుందా? జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు క్రెడిట్ ఇవ్వాలా? లేక ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మెయిన్ రోలా? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.


ప్లాన్ అంతా చంద్రబాబుదే.. కాకపోతే దాన్ని సక్సెస్ చేసే బాధ్యతను ఓ వైపు పవన్‌కల్యాణ్, మరోవైపు పురందేశ్వరికి అప్పగించారన్నది తెలుగు తమ్ముళ్లు చెబుతున్నమాట. ఈ విషయంలో పవన్ చరిష్మాను తక్కువ అంచనా వేయలేము. 2014లో పవన్ వ్యాఖ్యలకు.. ఇప్పుడు స్పీచ్‌కు చాలా తేడా ఉందంటున్నా రు. ఒకప్పుడు ఆవేశంతో మాట్లాడే జనసేనాని, ఇప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఆవేశాన్ని ప్రదర్శించడం రాజకీయాల్లో అదొక అస్త్రమని అంటున్నారు కొందరు నేతలు.

బీజేపీతో కలయిక కూడా దీనికి కారణమన్నది మరోవైపు వినిపిస్తున్నమాట. పురందేశ్వరి.. హైకమాండ్‌తో మాట్లాడి పొత్తును సక్సెస్ చేయడంలో ఆమెదీ కీలకపాత్రని అంటున్నారు. ఎన్నికల ప్రకటన తర్వాత వైసీపీ అరాచకాన్ని అడ్డుకోవడంలో టీడీపీ సక్సెస్ అయ్యింది. పేరుకే బీజేపీతో పొత్తుగానీ ప్రచారం అంతా తానై నడిపించారు చంద్రబాబు, పవన్. నాలుగైదు సభలకు మాత్రమే బీజేపీ కీలక నేతలు హాజరయ్యారు. ఈ విషయంలో క్రెడిట్ బాబుదేనని అంటున్నారు.


ALSO READ: అదో సెంటిమెంట్, జైలుకెళ్తే సీఎం ఖాయం

సూపర్ సిక్స్ పథకాలు కూడా కూటమి గెలుపుకు కారణమని అంటున్నారు. పై విషయాల్లో ఏ ఒక్కటి లేకుండా టీడీపీ గెలుపు కష్టమని అంటున్నారు. ఇది నాణెనికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు జగన్ చేసిన తప్పిదాలే కూటమి విజయానికి బాటలు వేసిందని అంటున్నవాళ్లూ లేకపోలేదు. ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్, వై నాట్ 175 స్లోగన్, మూడు రాజధానులు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టు ఉంది. మొత్తానికి ఈసారి ఎన్నికల్లో కూటమి గెలుపు వెనుక అందరూ తమవంతు పాత్ర నిర్వహించారనే చెప్పవచ్చు.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×