E-Paper
Advertisement

Anantapuram: అనంతపురంలో శ్రీరామాలయం రథానికి నిప్పు.. స్పందించిన సీఎం

Anantapuram: అనంతపురంలో శ్రీరామాలయం రథానికి నిప్పు.. స్పందించిన సీఎం

Atrocity in Anantapuram Chariot of Sriramalayam Set on Fire: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే తిరుమల లడ్డూ కల్తీ వివాదం నడుస్తున్న నేపథ్యంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాళ్‌ గ్రామంలో శ్రీరామాలయం రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. వెంటనే స్పందించిన స్థానికులు మంటలను అదుపు చేశారు. అప్పటికే రథం సగం కాలిపోయింది. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. రథం కాలిపోవడంపై అధికారులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. రథానికి నిప్పుపెట్టడాన్ని సీఎం చంద్రబాబు ఖండించారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు. దర్యాప్తుకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తనకు తెలపాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.

Also Read:  బుడమేరు ఆపరేషన్.. 270 ఎకరాల్లో ఆక్రమణలు

ఈ ఘటనలో రథం సగంపైగా కాలిపోయింది. అయితే సంఘటనా స్థలం వద్ద బీజేపీ , బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రథానికి ఎవరు నిప్పు పెట్టారో వెంటనే తెలుసుకుని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. తమ సెంటిమెంట్లను దెబ్బతీయడానికి కొందరు కావాలనే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని పలువురు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నారు.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×