BigTV English
Advertisement

Anantapuram: అనంతపురంలో శ్రీరామాలయం రథానికి నిప్పు.. స్పందించిన సీఎం

Anantapuram: అనంతపురంలో శ్రీరామాలయం రథానికి నిప్పు.. స్పందించిన సీఎం

Atrocity in Anantapuram Chariot of Sriramalayam Set on Fire: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే తిరుమల లడ్డూ కల్తీ వివాదం నడుస్తున్న నేపథ్యంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాళ్‌ గ్రామంలో శ్రీరామాలయం రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. వెంటనే స్పందించిన స్థానికులు మంటలను అదుపు చేశారు. అప్పటికే రథం సగం కాలిపోయింది. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. రథం కాలిపోవడంపై అధికారులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. రథానికి నిప్పుపెట్టడాన్ని సీఎం చంద్రబాబు ఖండించారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు. దర్యాప్తుకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తనకు తెలపాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.

Also Read:  బుడమేరు ఆపరేషన్.. 270 ఎకరాల్లో ఆక్రమణలు


ఈ ఘటనలో రథం సగంపైగా కాలిపోయింది. అయితే సంఘటనా స్థలం వద్ద బీజేపీ , బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రథానికి ఎవరు నిప్పు పెట్టారో వెంటనే తెలుసుకుని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. తమ సెంటిమెంట్లను దెబ్బతీయడానికి కొందరు కావాలనే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని పలువురు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నారు.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×