E-Paper
Advertisement

Jagan : సీఎం జగన్ ఢిల్లీ టూర్.. ఎజెండా ఇదేనా..?

Jagan : సీఎం జగన్ ఢిల్లీ టూర్.. ఎజెండా ఇదేనా..?
Advertisement

Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది. మే చివరి వారంలో జగన్ ఢిల్లీ వెళ్లారు. అప్పుడు వారంరోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఢిల్లీకి వెళ్లారు. ఇప్పుడు మరోసారి హస్తినకు సీఎం జగన్ వెళ్లారు.

ఢిల్లీ­లోని జనపథ్‌–1 నివాసానికి జగన్ చేరుకున్నారు. సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలుస్తారని తెలుస్తోంది. అలాగే పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై మోదీ, అమిత్ షా, కేంద్రమంత్రులతో చర్చిస్తారని సమాచారం.

Advertisement

మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను జగన్ కలుస్తారని తెలుస్తోంది. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో జగన్ భేటీ కానున్నారని సమాచారం. సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్ సమావేశమవుతారు. బుధవారం రాత్రి ఢిల్లీలోనే బస చేస్తారు. గురువారం కేంద్ర జలశక్తి మంత్రి, అందుబాటులో ఉన్న ఇతర కేంద్రమంత్రులను జగన్ కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఢిల్లీ నుంచి ఏపీకి తిరిగి వస్తారు.

రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాజకీయ అంశాలను ప్రధానంగా చర్చిస్తారని టాక్ వినిపిస్తోంది.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×