E-Paper
Advertisement

Jagan : సీఎం జగన్ ఢిల్లీ టూర్.. ఎజెండా ఇదేనా..?

Jagan : సీఎం జగన్ ఢిల్లీ టూర్.. ఎజెండా ఇదేనా..?

Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది. మే చివరి వారంలో జగన్ ఢిల్లీ వెళ్లారు. అప్పుడు వారంరోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఢిల్లీకి వెళ్లారు. ఇప్పుడు మరోసారి హస్తినకు సీఎం జగన్ వెళ్లారు.

ఢిల్లీ­లోని జనపథ్‌–1 నివాసానికి జగన్ చేరుకున్నారు. సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలుస్తారని తెలుస్తోంది. అలాగే పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై మోదీ, అమిత్ షా, కేంద్రమంత్రులతో చర్చిస్తారని సమాచారం.

మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను జగన్ కలుస్తారని తెలుస్తోంది. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో జగన్ భేటీ కానున్నారని సమాచారం. సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్ సమావేశమవుతారు. బుధవారం రాత్రి ఢిల్లీలోనే బస చేస్తారు. గురువారం కేంద్ర జలశక్తి మంత్రి, అందుబాటులో ఉన్న ఇతర కేంద్రమంత్రులను జగన్ కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఢిల్లీ నుంచి ఏపీకి తిరిగి వస్తారు.

రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాజకీయ అంశాలను ప్రధానంగా చర్చిస్తారని టాక్ వినిపిస్తోంది.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×