E-Paper
Advertisement

Papikondala tour : పాపికొండల టూర్ కు గ్రీన్ సిగ్నల్..టిక్కెట్ ధర ఎంతో తెలుసా?

Papikondala tour : పాపికొండల టూర్ కు గ్రీన్ సిగ్నల్..టిక్కెట్ ధర ఎంతో తెలుసా?
Advertisement

Papikondala tour : గోదావరిలో విహారయాత్రకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. పాపికొండల సందర్శన కోసం నిర్వహించిన ట్రయల్ రన్ ​విజయవంతమైంది. సోమవారం వీఆర్​పురం మండలంలో ఎస్ఐ, ఎంపీడీఓ లాంచీల యజమానులతో కలిసి ట్రయల్​ రన్​ నిర్వహించారు. వీఆర్​పురం మండలం పోచవరం నుంచి పాపికొండలు దాటి తెల్లదిబ్బలు, కొర్టూరు వరకు లాంచీలో వెళ్లారు. అక్కడ పరిస్థితులను పరిశీలించారు. గోదావరిలో విహారయాత్ర చేసేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని నివేదిక ఇచ్చారు. దీంతో నవంబర్ 9 నుంచి గోదావరిలో విహారయాత్రకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Advertisement

భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్న తర్వాత టూరిస్టులు పాపికొండల యాత్రకు వెళ్లేందుకు భద్రాచలంలో టికెట్​ కౌంటర్లు ప్రారంభించారు. పెద్దలకు రూ. 950, పిల్లలకు రూ. 750గా టిక్కెట్ ధరను నిర్ణయించారు.

గోదావరి విహారయాత్ర కోసం 17 లాంచీలకు అనుమతినిచ్చారు. ఒక్కో లాంచీలో సామర్థ్యాన్ని బట్టి సందర్శకులను ఎక్కించుకునేందుకు అనుమతి ఇచ్చారు. ప్రతి లాంచీ పోచవరం నుంచి బయలుదేరి పాపికొండల్లోని కొర్టూరు వరకు వెళ్లి తిరిగి వస్తుంది. మధ్యలో పేరంటాలపల్లి ఆశ్రమ సందర్శన ఉంటుంది. మార్గమధ్యలో టీ, టిఫిన్​, భోజనం ఏర్పాటు చేస్తారు.

Advertisement

కార్తీకమాసంలో గోదావరిలో విహారయాత్ర చేసేందుకు సందర్శకులు భారీగా వస్తారు. ఈ నెలలో పాపికొండల అందాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. చలి వాతావరణంలో విహార యాత్రను ఆస్వాదిస్తారు. తెలుగురాష్ట్ట్రాల నుంచి గోదావరిలో విహారయాత్ర చేసేందుకు భారీగా సందర్శకులు వస్తారు. ఇందులో హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×