BigTV English
Advertisement

AP Govt: దీపం 2.o పథకంపై ప్రభుత్వం కీలక ప్రకటన.. ఇలా తప్పక చేయండి

AP Govt: దీపం 2.o పథకంపై ప్రభుత్వం కీలక ప్రకటన.. ఇలా తప్పక చేయండి

AP Govt: ఏపీ ప్రజలకు సంక్రాంతి పండుగ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తున్న విషయం తెలిసిందే. సూపర్ సిక్స్ లో ప్రధానంగా దీపం 2.0 పథకాన్ని దీపావళి నాడు అమల్లోకి తెచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి, అర్హులకు తప్పనిసరిగా పథక లబ్ధి చేకూరాలని ఆదేశాలు సైతం జారీ చేశారు. ఈ పథకం అమలు గురించి ఇప్పటికే ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దీపం 2.0 పథకంపై మరో కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం.


ఏపీ మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ లను అందజేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలుత ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. దీపం పథకాన్ని ప్రవేశపెట్టిన నాటి టీడీపీ ప్రభుత్వం ఇంటింటికి గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేసింది. ఇప్పుడు ఏపీలో అధికారంలో గల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏకంగా మూడు సిలిండర్లను ఏడాదికి ఉచితంగా అందిస్తోంది. అయితే ఇప్పటికే ఎందరో లబ్ధిదారులు సిలిండర్లను బుక్ చేసుకొని నగదును సైతం అందుకున్నారు. పేద ప్రజలకు మేలు చేకూర్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుగా ఈ పథకాన్ని అమలు చేసిందని చెప్పవచ్చు.

Also Read: Telangana Govt: ఏపీలో మొండిచేయి.. తెలంగాణలో ఆ పథకానికి శ్రీకారం.. డోంట్ మిస్!


సిలిండర్ డెలివరీ సమయంలో నగదును చెల్లించడం, ఆ తర్వాత 24 గంటల్లోగా ఆ నగదు లబ్ధిదారునికి జమ కావడం ఈ పథకంలోని ప్రధానాంశం. ఇప్పటికీ మొదటి ఉచిత సిలిండర్ ను పొందని లబ్ధిదారులు మార్చి 31వ తేదీలోగా ఎప్పుడైనా సిలిండర్ను బుక్ చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ పథకం ద్వారా ఒక కోటి 55 లక్షల మంది లబ్ధిదారులలో 91 లక్షల మందికి ప్రయోజనం కలిగిందని ప్రభుత్వం తెలిపింది. మరి మీరు మొదటి ఉచిత సిలిండర్ ఇంకా పొందలేదా.. అయితే మార్చి 31 లోగా సిలిండర్ బుక్ చేసుకోండి.. దీపం 2.0 పథకంతో లబ్ధి పొందండి.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×