E-Paper
Advertisement

AP : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

AP : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
Advertisement

AP : ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సేవలందించేందుకు సిద్ధమైంది. ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1,489 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దూర ప్రాంతాలు, అంతర్రాష్ట సర్వీసుల కోసం ఈ బస్సులను వినియోగించనుంది.

Advertisement

డీలర్ల వద్ద నుంచి కాకుండా నేరుగా బస్సుల తయా­రీ కంపెనీల నుంచే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో బస్‌ ఖరీదు దాదాపు రూ.45 లక్షల చొప్పున మొత్తం రూ.670 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని నిర్ణయించింది. అందుకే జ్యుడీషియల్‌ ప్రివ్యూకు ఆర్టీసీ నివేదించింది. టెండర్‌ డాక్యుమెంట్లను జ్యుడీషియల్‌ ప్రివ్యూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. టెండరు నిబంధనలు, ఇతర అంశాలపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఈ-మెయిల్‌ ద్వారా తెలిపే అవకాశం కల్పించింది. ఇందుకోసం ఈ నెల 19 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఇచ్చింది.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×