E-Paper
Advertisement

Karnataka : 100కుపైగా స్థానాల్లో కాంగ్రెస్ లీడ్.. బీజేపీ నుంచి గట్టి పోటీ .. కీలకంగా మారిన జేడీఎస్..

Karnataka : 100కుపైగా స్థానాల్లో కాంగ్రెస్ లీడ్.. బీజేపీ నుంచి గట్టి పోటీ .. కీలకంగా మారిన జేడీఎస్..
Advertisement

Karnataka News Today(Latest election results in India): కర్ణాటక ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొదట ఓట్ ఫ్రమ్ హోమ్, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. హోరీహోరీగా పోటీ కొనసాగుతోంది. 100కుపైగా స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో జేడీఎస్ కీలకంగా మారనుంది.

Advertisement

కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. 113 స్థానాలు గెలిచిన పార్టీకి అధికారం దక్కుతుంది. ఈ
ఎన్నికల్లో 73.19 శాతం పోలింగ్‌ నమోదైంది. 2,615 మంది అభ్యర్థుల పోటీలో ఉన్నారు. హంగ్ వస్తే పరిస్థితి ఏంటన్నదానిపై చర్చ నడుస్తోంది. క్యాంప్ రాజకీయాలు షురూ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

వరుణ నియోజకవర్గం నుంచి సిద్ధరామయ్య పోటీ చేశారు. కనకపుర నుంచి బరిలో డీకే శివకుమార్
హుబ్బళి ధార్వాడ్ సెంట్రల్ నుంచి జగదీష్ శెట్టర్, శిగ్గావి నుంచి సీఎం బస్వరాజ్ బొమ్మై బరిలో ఉన్నారు.
చన్నపట్న నుంచి కుమారస్వామి పోటీలో ఉన్నారు.

Advertisement

దేశవ్యాప్తంగా కర్ణాటక ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. బెట్టింగ్ లు జోరుగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులోనూ భారీగా పందేలు కాస్తున్నారు. కోట్లలో వ్యాపారం జరుగుతోందని అంచనా వేస్తున్నారు.

Related News

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

ఏడేళ్ల బంధం.. ఎండమావి అయింది.. ప్రియుడితో కలిసి భర్త తల నరికిన భార్య, ఎక్కడంటే?

Big Stories

Advertisement
×