E-Paper
Advertisement

AP Govt: ఏపీలో ఆ కష్టాలకు ఇక చెల్లు.. వేలు అవసరం లేదు.. అంతా ఉచితమే!

AP Govt: ఏపీలో ఆ కష్టాలకు ఇక చెల్లు.. వేలు అవసరం లేదు.. అంతా ఉచితమే!

AP Govt: ఏపీలో ఆ కష్టాలకు ఇక చెల్లు. మనిషి మరణంలోనూ, తప్పని తిప్పలు కోకొల్లలు. మృతదేహాలను బైక్ పై, ఎద్దుల బండిపై, లేకుంటే ఒక్కరే ఎత్తుకొని తీసుకుపోయిన సంధర్భాలు ఎన్నో ఎన్నెన్నో మనకు కనిపిస్తాయి. ఆ కష్టాలకు చెక్ పెట్టేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో మృతువు సమయంలోనూ, ఆర్థిక భారం మోయలేని కుటుంబాలకు ఊపిరి అందినట్లే.

సాధారణంగా వైద్యశాలలో ఎవరైనా మరణిస్తే, ఆ మృతదేహాన్ని ఇంటికి తరలించాలంటే జేబులో డబ్బులు ఉండాలి. అంతేకాదు మృతదేహం అనగానే, భారీ మొత్తం చెల్లించుకోవాలి. ఇక పేద కుటుంబీకులైతే, ఆ బాధ వర్ణనాతీతం. ఓ వైపు కుటుంబంలోని వ్యక్తి మృతి, మరోవైపు చేతిలో చిల్లిగవ్వ లేక ఎందరో కన్నీరు కార్చిన ఘటనలు కూడా ఉన్నాయి. కొందరు స్వయంగా మోసుకెళ్లిన ఘటనలు ఉండగా, మరికొందరు బైక్స్ పై, సైకిళ్లపై కూడా మృతదేహాలను తీసుకెళ్లిన రోజులు ఉన్నాయి. ఈ కష్టాలను గుర్తించిన ప్రభుత్వం మరోమారు మహా ప్రస్థానం అంబులెన్స్ లను ప్రవేశపెట్టింది.

2014-19 టీడీపీ పరిపాలన కాలంలో మహా ప్రస్థానం అంబులెన్స్ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆ తరువాత అనివార్య కారణాల వల్ల పథకం అమలు కాలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం, ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వెంటనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు మహా ప్రస్థానం అంబులెన్స్ ఏర్పాటుపై అధికారులతో సమీక్షించారు. వెంటనే పథకం అమలులోకి రావాలని నిర్ణయించిన ఏపీ సర్కార్, ఏడాదికి వీటి నిర్వహణకు రూ. 9.54 కోట్లు ఖర్చు పెట్టనుంది.

Also Read: Borewell Incident: బోరుబావిలో 16 గంటలు.. బిడ్డ నరకం.. పూజల్లో తల్లి.. చివరికి మృత్యువు ఒడిలోకి!

అసలే మనిషి చనిపోయిన సమయంలో పడే రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వైద్యశాల నుండి మృతదేహాలను తరలించేందుకు కేవలం ఒక్క 108  కాల్ తో మహా ప్రస్థానం వాహనం ముందుకు రానుంది. దీనితో డబ్బులు అధికంగా వసూలు చేసే, అంబులెన్స్ సామ్రాజ్యానికి కొంత చెక్ పెట్టినట్లు చెప్పవచ్చు. మొత్తం మీద మహా ప్రస్థానం అంబులెన్స్ స్కీమ్ మంచిదేనంటున్నారు ఏపీ ప్రజలు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×