E-Paper
Advertisement

AP: సంఘం గుర్తింపు రద్దు చేస్తాం.. గవర్నర్‌ను ఎందుకు కలిశారు? జగన్ సర్కార్ యాక్షన్

AP: సంఘం గుర్తింపు రద్దు చేస్తాం.. గవర్నర్‌ను ఎందుకు కలిశారు? జగన్ సర్కార్ యాక్షన్
Advertisement

AP: ఏపీ పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి. జగన్ ప్రభుత్వం వచ్చాక రాజకీయ వేడి మరింత పెరిగింది. వైసీపీ, టీడీపీ, జనసేనల మధ్య ట్రయాంగిల్ వార్ జోరుగా నడుస్తోంది. జీవో నెంబర్ 1తో ఏపీ పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. ఇక, తామేమైనా తక్కువా అన్నట్టు ఉద్యోగ సంఘాలు సైతం పీఆర్సీ ఎపిసోడ్ నుంచి సర్కారుపై సమరం చేస్తున్నాయి. లేటెస్ట్ గా, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు నేరుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి.. తమకు జరుగుతున్న అన్యాయంపై, జగన్ ప్రభుత్వ విధానాలపై ఫిర్యాదు చేయడం మరింత సంచలనంగా మారింది.

ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతభత్యాలు అందేలా చట్టం చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆధ్వర్యంలో నేతలు ఇటీవల గవర్నర్‌ను కలిశారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.

Advertisement

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తీరుపై ఏపీ ఎన్జీవో సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో విషయం మరింత ముదిరింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణను కొన్ని శక్తులు వెనక ఉండి నడిపిస్తున్నాయని ఆరోపించింది ఎన్జీవో సంఘం. రోసా నిబంధనలకు విరుద్ధంగా ఆ సంఘానికి గుర్తింపు ఇచ్చారని.. అందుకే వెంటనే గుర్తింపు రద్దు చేయాలని చీఫ్ సెక్రటరీ జవహరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు ఏపీ ఎన్జీవో సంఘం నేతలు.

కట్ చేస్తే.. ఏపీ సర్కార్ యాక్షన్ లోకి దిగింది. ప్రభుత్వంపైనే గవర్నర్ కు ఫిర్యాదు చేస్తారా? అని కన్నెర్ర జేసింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలవడంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరింది. ఆ సంఘానికి నోటీసులు జారీ చేసింది.

Advertisement

వేతనాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే ప్రత్యామ్నాయ మార్గాలు ఉండగా.. గవర్నర్ ను ఎందుకు కలిశారని నోటీసులో ప్రశ్నించింది ప్రభుత్వం. గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయడం రోసా నిబంధనలకు విరుద్ధమని.. సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వారంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పరిస్థితి చూస్తుంటే.. వేటు తప్పకపోవచ్చని అంటున్నారు.

Related News

చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. తాడేపల్లిలో టీడీపీ వినూత్న కార్యక్రమం

జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ .. ఎప్పుడో తెలుసా ?

ఏపీలో కొత్త పింఛన్లపై.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బిగ్ అనౌన్స్‌మెంట్!

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఇవాళ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. భీకర గాలులతో పిడుగులు!

13 రోజులకే పాస్‌పోర్ట్.. ఇచ్చాపురం చిన్నారి ప్రపంచ రికార్డు

ఏపీ పిల్లలకు ఢిల్లీలో ఈ తిప్పలు ఎందుకు?..విజయసాయి రెడ్డి ఫైర్!

ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో రమా నందనా విచారణ.. ఏం జరిగిందంటే?

జాబ్స్ అడిగితే కేసులా బాబు? ఇదేం దారుణం: జగన్ ఫైర్

Big Stories

Advertisement
×