E-Paper
Advertisement

HC ON SAJJALA : సజ్జల పిటిషన్‌పై హైకోర్టు కీలక నిర్ణయం, కేసు చీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదిలీ

HC ON SAJJALA : సజ్జల పిటిషన్‌పై హైకోర్టు కీలక నిర్ణయం, కేసు చీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదిలీ
Advertisement

HC ON SAJJALA : లుక్‌ ఔట్‌ నోటీసు రద్దు చేయాలని సజ్జల దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేసును చీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వైసీపీ కీలక నేత, సజ్జల రామకృష్ణారెడ్డి LOC (Look out circular) పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, విచారణను సీజే (CHIEF JUSTICE) బెంచ్‌కు బదిలీ చేయాలని న్యాయమూర్తి రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

ఎస్పీ లుక్ అవుట్ నోటీస్…

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ పార్టీ ప్రధాన కారదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై మంగళగిరి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి సజ్జలపై గుంటూరు ఎస్పీ లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు.

Advertisement

2021 అక్టోబర్ 19న దాడి… 

సీఎంగా జగన్ అధికారంలో ఉన్న కాలంలో 2021 అక్టోబర్‌ 19న వైసీపీకి చెందిన పలువురు కార్యకర్తలు, నేతలు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పూనుకున్నారు. పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో తొలుత సజ్జల పేరు బయటకు రాలేదు.

తర్వాత విచారణలో భాగంగా రామకృష్ణారెడ్డి ప్రమేయం కూడా ఉందని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ఈ క్రమంలోనే ఆయన విదేశాలకు వెళ్లకుండా పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్‌, తలశిల రఘురామ్‌ను ఇప్పటికే పలుమార్లు పోలీసు స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.

Also Read : ఆ ఒక్క ట్వీట్ తో మనసు దోచేసిన సీఎం రేవంత్.. అసలు ఆ ట్వీట్ లో ఏముందంటే?

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×