E-Paper
Advertisement

BRS : బీఆర్ఎస్ లోకి ఏపీ నేతలు..కేసీఆర్ వ్యూహం ఇదేనా?..!

BRS : బీఆర్ఎస్ లోకి ఏపీ నేతలు..కేసీఆర్ వ్యూహం ఇదేనా?..!
Advertisement

BRS : తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ విస్తరణపై మరింత ఫోకస్ పెట్టారు. పొరుగు రాష్ట్రాలకు విస్తరించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. గతంలో జనసేనలో పని చేసిన తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, బీజేపీ నేత పార్థసారధి గులాబీ కండువా కప్పుకోబోతున్నారు.

తోట చంద్రశేఖర్‌ ఐఏఎస్ అధికారిగా ఉన్న సమయంలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ తరఫున ఏలూరు నుంచి ఎంపీగా బరిలో దిగి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జనసేనలో క్రియాశీలకంగా పనిచేశారు. 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం చవిచూశారు. ఇలా మూడు పార్టీల తరఫున మూడు ప్రాంతాల్లో పోటీ చేసినా ఆయన గెలవలేకపోయారు. తోట చంద్రశేఖర్ 2020 నుంచి జనసేన పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా కనిపించటం లేదు.

Advertisement

మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు ఐఆర్‌ఎస్‌ అధికారిగా రాజీనామా చేసి 2014లో టీడీపీలో చేరారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి రావెల ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు కేబినెట్‌లో స్థానం దక్కించుకున్నారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణలో పదవిని రావెల కోల్పోయారు. 2018లో రావెల జనసేనలో చేరారు. 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. ఓటమి తర్వాత రావెల బీజేపీలో చేరారు. అక్కడ కూడా ఇమడలేక పోయారు. దాదాపు ఏడాది క్రితం కాషాయ పార్టీని వీడారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు.

పార్థసారధి గతంలో ఐఆర్‌ఎస్‌ అధికారిగా పనిచేసి ముందస్తు పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో అనకాపల్లి పార్లమెంట్‌ స్థానం నుంచి జనసేన తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఆ తర్వాత బీజేపీలో చేరారు. కానీ ఆ పార్టీలో అంత యాక్టివ్ గా పనిచేయలేదు.

Advertisement

ఏపీలో అడుగు పెట్టేందుకు కేసీఆర్‌కు నాయకుల అవసరం ఉంది. ఆ మేరకు వివిధ పార్టీల్లో పనిచేసి, స్థానికంగా పరిచయాలున్న వారిని బీఆర్ఎస్ చేర్చుకోవాలని భావిస్తున్నారు. విజయవాడలో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అతి త్వరలోనే కార్యాలయం ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ లోగా కొందరు ఏపీ నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకోవాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోనూ బీఆర్ఎస్ తరఫున కార్యకలాపాలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగాలను ఏర్పాటు చేసేందుకు కొందరు ముందుకొచ్చారు. ఏపీ స్టూడెంట్స్‌, యూత్‌ జేఏసీకి చెందిన రాయపాటి జగదీష్‌ ఈ మేరకు ప్రకటన చేశారు.

Related News

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

Big Stories

Advertisement
×