E-Paper
Advertisement

Duvvada vs Kollu Ravindra: మండలిలో మద్యం మంటలు.. మంత్రిపై దువ్వాడ ఫైర్

Duvvada vs Kollu Ravindra: మండలిలో మద్యం మంటలు.. మంత్రిపై దువ్వాడ ఫైర్
Advertisement

Duvvada vs Kollu Ravindra: ఏపీ రాజకీయాలకు శాసన మండలి వేదికైంది. మండలిలో వైసీపీ సభ్యులు అధికంగా ఉండడంతో ప్రభుత్వంపై ముప్పేట దాడి మొదలుపెట్టే ప్రయత్నం చేసింది. లేటెస్ట్‌గా కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొన్నిన మద్య పాలసీపై సభలో అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది.

శుక్రవారం మండలి సమావేశాలు ప్రారంభం కాగానే ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ గురించి వివరించారు మంత్రి కొల్లు రవీంద్ర. మిగతా రాష్ట్రాలతో ధరలు పోల్చిన తర్వాతే తక్కువ ధరకే మద్యం ఇస్తున్నామన్నారు. దీనిపై వైసీపీకి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు నోరు విప్పారు.

Advertisement

వైసీపీ హయాంలో షాపులను కుదించి, ప్రభుత్వమే అమ్మకాలు సాగించిందన్నారు. ఆ విధానాన్ని మార్చి, మళ్లీ షాపులను పెంచి టెండర్లు ఇచ్చారన్నారు. షాపుల కేటాయింపు లో రౌడీయిజం జరిగిందన్నారు. ఇదేనా నూతన మద్యం విధానమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మధ్యలో మండలి ఛైర్మన్ మోషేన్ రాజు జోక్యం చేసుకున్నారు. పేపర్‌లో వచ్చిన ఆర్టికల్స్ ఇక్కడ ప్రామాణికం కాదన్నారు. మద్యం పాలసీపై దువ్వాడకు ఇవాళ గుర్తు వచ్చిందా అంటూ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. వైసీపీ హయాంలో షాపులను పెంచారని, కూటమి ప్రభుత్వం ఏమాత్రం పెంచలేదన్నారు.

Advertisement

ALSO READ: నేడు హ‌స్తిన‌కు సీఎం చంద్ర‌బాబు.. కేంద్ర‌మంత్రుల‌తో భేటీ.. కార‌ణం ఇదే

10 శాతం కల్లుగీత కార్మికులకు ఇవ్వడం తప్పా అంటూ ఎదురుదాడి మొదలుపెట్టారు మంత్రి. ఆనాడు రేట్లు విపరీతంగా పెంచారన్నారు. 20 డిస్టలరీస్‌కు సంబంధించి 60శాతం వాటా బలవంతంగా  తీసుకున్నారని మండిపడ్డారు.

అంతర్జాతీయ బ్రాండ్లను తీసుకురాలేదన్నారు. ఎక్సైజ్ డిపార్టుమెంట్ మొత్తాన్ని వైసీపీ నాశనం చేసిందని గుర్తు చేశారు. ఓన్లీ క్యాష్ రూపంలో నగదు తీసుకున్నారని, ఆ మనీ ఎక్కడని ప్రశ్నించారు మంత్రి. మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో మద్యం తక్కువగానే ఉంటుందన్నారు. మద్యం పేరిట వైసీపీ దోపిడీకి పాల్పడిందని దుయ్యబట్టారు మంత్రి కొల్లు రవీంద్ర.

ప్రస్తుతం అంతర్జాతీయ బ్రాండ్లను తీసుకొచ్చామన్నారు మంత్రి.  లిక్కర్‌లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణ జరిగిందన్నారు. సీఐడీ దర్యాప్తు చేస్తోందని, ప్రధాన సూత్రదారులు బయటకు వస్తారన్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×