Illegal Sand: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3 ట్రాక్టర్లు.. 6 టిప్పర్లు అన్నట్టుగా నిన్న మొన్నటి వరకు సాగిన ఇసుక, గ్రావెల్ దందాకు ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలు షాక్ ఇచ్చాయి. శ్రీ సిటీలో పర్యటించిన సీఎం చంద్రబాబు.. మట్టి మాఫియాపై సీరియస్ అయ్యారు. అక్రమ ఇసుక రవాణాపై పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు కామెంట్స్తో సరిహద్దుల్లో అక్రమ రవాణాకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సీఎం పర్యటన తర్వాత పరిస్థితి మళ్లీ సెట్ అవుతుందిలే అనుకునే లోపు తమిళనాడు గవర్నమెంట్ షాక్ ఇచ్చింది
పోలీసులకు సీఎం విజయ్ ఆదేశాలు..
తమిళనాడు సరిహద్దుల్లో ఖనిజాల అక్రమ తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు సీఎం విజయ్. దీంతో చెక్పోస్టుల దగ్గర వాహన తనిఖీలు చేయడమే కాకుండా అధికారులు రవాణా పర్మిషన్లు కూడా కఠినం చేశారు. దీంతో పూర్తిస్థాయి బిల్లులు, అనుమతులు ఉన్న వాహనాల మినహా మిగిలిన రవాణా దాదాపు నిలిచిపోయింది.
పుష్ప సినిమాను ఫాలో అవుతున్న మట్టి మాఫియా..
ఈ కఠిన చర్యలతో మట్టి మాఫియా పుష్ప సినిమాను ఫాలో అయిపోతున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లలో కాకుండా కంటైనర్లలో ఇతర వస్తువుల రవాణా ముసుగులో ఇసుక మట్టిని బోర్డర్ దాటించేస్తున్నారు. ఈ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రభుత్వాలు ఇంకెలాంటి చర్యలు తీసుకోవాలో ఏంటో?
Also Read: లెక్కలు తక్కువ.. ప్రాణనష్టం ఎక్కువ! యాదాద్రి జిల్లాలో క్యాన్సర్ పంజా