Baramati Aircraft: మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. మహారాష్టలోని బారామతిలో ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలి పోయింది. నేడు మధ్యాహ్నం 12:35 గంటల ప్రాంతంలో ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన ఒక శిక్షణ విమానం రన్వే సమీపంలో ఓక్కసారిగా క్రాష్-ల్యాండ్ అయ్యింది. దీతో పెను ప్రమాదం తప్పినట్టైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అక్కడి అధికారుల తెలిపారు.
Also Read: 20 రోజులుగా ఆచూకీ లేని ఆర్మీ జవాన్ రవి.. కన్నీరుమున్నీరవుతున్న తల్లి! ఇంతకీ ఏమైంది?
ప్రయాదంలో విమానంలో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. ఇది కార్వర్ ఏవియేషన్కు చెందిన సెస్నా 172 రకానికి చెందిన శిక్షణ విమానమని అధికారుల గుర్తించారు. కేవలం విమానానికి మాత్రం స్వల్పంగా నష్టం వాటిల్లిందని అక్కడి అధికారులు తెలిపారు. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో రన్వేపై అదుపుతప్పినట్లు పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ తెలిపారు. సాంకేతిక లోపం వల్ల ఈ ఘటన జరిగిందా లేదా మరేదైన ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు, విమానయాన అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
Also Read: BIGTV ఎఫెక్ట్.. కాలుష్య కంపెనీల గుట్టురట్టు చేస్తానన్న ఎంపీ చామల!