
AP Voters List 2023 Draft : ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ డ్రాఫ్ట్(ముసాయిదా) ఓటర్ల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. మొత్తం ఓటర్లు: 4,02,21,450 ఉండగా, పురుషులు: 1,98,31,791 మంది, మహిళలు: 2,03,85,851 మంది, ట్రాన్స్ జెండర్లు: 3808 మంది ఉన్నారని ఏపీ ఎన్నికల కమీషనర్ జాబితా విడుదల చేస్తూ పేర్కొన్నారు.
ఈ జాబితా ప్రకారం పురుషుల కంటే మహిళలే అధికంగా ఉండడం గమనార్హం. అలాగే అనంతపురం జిల్లాలో అత్యధికంగా 19,79,775 ఓటర్లు ఉండగా… అల్లూరి సీతారామారాజు జిల్లాలో అత్యల్పంగా 7,40,857 ఓటర్లు ఉన్నట్లు ఆయన చెప్పారు.
ముసాయిదా జాబితాలోని అభ్యంతరాలను డిసెంబరు 9 వరకు స్వీకరించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 2024 జనవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని పేర్కొంది. ముసాయిదా ఓటర్ల జాబితాను అన్ని జిల్లాల్లోని రాజకీయ పార్టీలకు ఇవ్వాల్సిందిగా జిల్లా అధికారులకు ఈసీ సూచించింది.
2022 జనవరి 6 నుంచి 2023 ఆగస్టు 30వరకు అన్ని స్థాన్నాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టినట్లు ఈసీ వెల్లడించింది. 21,18,940 ఓట్ల తొలగింపు ప్రక్రియను పునః పరిశీలన చేసినట్టు వివరించింది. ఆగస్టులో చేపట్టిన ఇంటింటి సర్వేలో జీరో డోర్ నెంబర్లతో 2,51,767 ఓట్లు గుర్తించినట్టు స్పష్టం చేసింది.
మొత్తం ఓటర్లు- 4,02,21,450
పురుషులు- 1,98,31,791
మహిళలు – 2,03,85,851
ట్రాన్స్ జెండర్లు – 3808
సర్వీస్ ఓటర్లు 66,158
పోలింగ్ కేంద్రాలు – 46,165