Achannaidu Jagan: రాష్ట్రంలో పనికిమాలిన రాజకీయ పార్టీ ఉంది అంటే ఆ రాజకీయ పార్టీ గొడ్డలి పార్టీనే అని వాళ్ళు చెప్పిన ప్రతి మాట అబద్ధం అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఏమరుపాటు జరిగి 2019 నటి ఫలితాలు మరల వస్తే చంద్రబాబుకు ,టీడీపీకి నష్టం కాదు.. రాష్ట్రానికి పెద్ద నష్టం జరుగుతుందని అన్నారు. జగన్ ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కూటమి పై బురద జల్లడం జగన్కు అలవాటు అయిపోయిందన్నారు.
జగన్ మాటలు కొంతమంది నమ్మితే నష్టం జరుగుతుంది కాబట్టి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామని, ప్రకృతి విపత్తు కంటే అతి పెద్ద విపత్తు గొడ్డలి పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తన ఐదు సంవత్సరాలు పాలను గుర్తుపెట్టుకోకుండా మాట్లాడడం బాధగా ఉందన్నారు. వర్షాభావ పరిస్థితులు ఐదు, ఆరు సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి. వర్షభావ పరిస్థితులను ఎద్గురుకోవడానికి రిజర్వాయర్లు నిర్మిస్తారు. గతంలో చంద్రబాబు 64 వేల కోట్లు రూపాయిలు ఒక్క ఇరిగేషన్ పైనే ఖర్చుపెట్టారని గుర్తు చేశారు.
Also read: ఎల్నినో ఎఫెక్ట్ ఎండిపోయిన చెరువులు.. చేపపిల్లల పథకం ఉన్నట్టా లేనట్టా..?
రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులను గాడిలో పెట్టాము. రెండు సంవత్సరాలలో కొన్ని ప్రాజెక్టులు పూర్తి అవతాయన్న తరుణంలో జగన్ అధికారంలోకి వచ్చారని అన్నారు. జగన్ ఒక్క జిఓతో ప్రాజెక్టులు ఆగిపోయాయి. జగన్ రాయలసీమకు చేసిన ద్రోహం స్వతంత్ర భారత దేశంలో జరగలేదని ఫైర్ అయ్యారు. ఈ రెండున్నర సంవత్సరాలలో 13,500 కోట్లు ఖర్చు చేసి రాయలసీమలో అన్ని ప్రాజెక్టులను గాడిలో పెట్టామని అన్నారు. జగన్ ఇరిగేషన్ ప్రాజెక్టులను నాసినం చేసి ఎల్ నినో కోసం మాట్లాడుతున్నారు. జగన్ పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసి ఉంటే ఎల్ నినో లు ఎన్ని వచ్చినా రైతులకు ఇబ్బంది ఉండేది కాదని అన్నారు.
జగన్ పోలవరంను గోదావరిలో కలిపేశారు. గోదావరి పుష్కరాలు ముందు పోలవరం ప్రారంభించుకోబోతున్నాము. సీఎం చంద్రబాబు వెలుగొండ ప్రోజెక్టును ప్రారంభిస్తున్నారని, వచ్చే నెల మూడవ తేదీన ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకువస్తున్నారన్నారు. ఎల్ నినో కంటే పెద్ద విపత్తు జగన్. ఎల్ నినో పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, రైతులను అప్రమత్తం చేసాము ఏ పంటలు వేయాలో అవగాహన కల్పించామని, పంటల కోసం జగన్కు ఎమ్ తెలుసని సెటేర్లు వేసారు.
Also read: బిగ్ బాస్ లోకి స్టార్ హీరోయిన్.. రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్!