E-Paper
Advertisement

CM Chandrababu: భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కనెక్టివిటీ- సీఎం చంద్రబాబు

CM Chandrababu: భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కనెక్టివిటీ- సీఎం చంద్రబాబు
Advertisement

CM Chandrababu: భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్ విజయవంతం అయిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. 2014-2019 మధ్య కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ఈ ఎయిర్ పోర్టు నిర్మాణం.. ఈ ఏడాది జూన్ నాటికి పూర్తికానుందన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టులో మిగిలిన 4 శాతం పనులు కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

ఉత్తరాంధ్ర దశ దిశ మారబోతోంది

“18 నెలల కాలంలో విమానాశ్రయ పనులు వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి రావడానికి కారణమైన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. భోగాపురం ఎయిర్ పోర్టు ఆ ప్రాంత కనెక్టివిటీ పెంచి అభివృద్దికి దోహద పడుతుంది. పోర్టులు, ఎయిర్ పోర్టులు, నేషనల్ హైవేలు, ఐటీ సహా వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ సంస్థల రాకతో ఉత్తరాంధ్ర దశ దిశ మారబోతోంది. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్దికి సంకల్పంతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం కోరుకుంటూ….ఈ సందర్భాన ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను” -సీఎం చంద్రబాబు

తొలి విమానం ల్యాండ్

Advertisement

మరికొన్ని రోజుల్లో ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారం కానుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్ పోర్టులో ఆదివారం తొలి విమానం ల్యాండ్‌ అయింది. వ్యాలిడేషన్‌ టెస్ట్ లో భాగంగా తొలి ఫ్లైట్‌ దిల్లీ నుంచి భోగాపురానికి చేరుకుంది. ఈ విమానంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ ఛైర్మన్‌, అధికారులు ఉన్నారు. అత్యాధునిక సాంకేతికతో భోగాపురం ఎయిర్ పోర్టును నిర్మిస్తున్నారు. 96 శాతం పనులు పూర్తి అయినట్లు జీఎంఆర్‌ సంస్థ పేర్కొంది. జూన్‌ 26,2026న భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రజలకు అందుబాటులోకి రానుంది.

Also Read: భోగాపురంపై ప్రాణం పెట్టిన టీడీపీ.. కాదు కాదు ఆ ఘనత మాదే!

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×