E-Paper
Advertisement

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో చారిత్రక ఘట్టం.. ల్యాండ్‌ అయిన తొలి విమానం!

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో చారిత్రక ఘట్టం.. ల్యాండ్‌ అయిన తొలి విమానం!
Advertisement

Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ రవాణా రంగంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. ఎయిర్‌పోర్టు నుంచి తొలిసారిగా వాణిజ్య విమాన సర్వీసులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

సోమవారం ఉదయం 7:00 గంటలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం భోగాపురం రన్‌వేపై విజయవంతంగా ల్యాండ్‌ అయింది. విమానాశ్రయ చరిత్రలో ఇది మొదటి ల్యాండింగ్ కావడంతో అక్కడి వాతావరణం పండగను తలపించింది. ల్యాండైన వెంటనే ఎయిర్‌పోర్టు అధికారులు, జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు ప్రయాణికులకు ఘనంగా స్వాగతం పలికారు. తెలుగువారి విశిష్ట సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే ఏటికొప్పాక బొమ్మలను ప్రయాణికులకు జ్ఞాపికలుగా అందించి తమ సంతోషాన్ని పంచుకున్నారు.

Advertisement

ఈ తొలి విమానం ఉదయం 7:30 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లింది. అదే సమయంలో, ఉదయం 7:30 గంటలకు బెంగళూరు నుంచి వచ్చిన మరో ఇండిగో విమానం భోగాపురంలో ల్యాండ్‌ అయి, ఉదయం 8:00 గంటలకు తిరిగి బెంగళూరుకు పయనమైంది. ఈ ల్యాండింగ్‌లతో ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘ స్వప్నం సాకారమై, ప్రాంతీయ విమాన అనుసంధానత మరింత బలపడింది.

Advertisement

Also Read: చేప పిల్లల పంపిణీకి బకాయిల బ్రేక్.. సస్పెన్స్‌లో మత్స్యకారుల భవిష్యత్తు!

Tags

Related News

నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. 4 రోజుల పాటు కీలక అంశాలపై చర్చ!

మోదీకి భయం పట్టుకుంది.. ప్రతిపక్షాలపై అందుకే దాడి- వైఎస్ షర్మిలా రెడ్డి

భీమవరంలో దారుణం.. స్నానానికి కాలువలో దిగి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి!

తాడిపత్రిలో ఊహించని ఘటన.. నిశ్చితార్థ వేడుకలో టీడీపీ వర్సెస్ వైసీపీ రాళ్ల దాడి!

చంద్రగిరిలో ఏనుగుల రచ్చ.. రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

దేశంలోనే అత్యంత డర్టీ పొలిటీషియన్ చంద్రబాబే: మాజీ మంత్రి రోజా

యారాడ బీచ్‌లో టూరిస్టులకు తప్పిన ప్రమాదం.. మహిళను రక్షించిన బీచ్ లైఫ్‌గార్డ్స్

Big Stories

Advertisement
×