BigTV English
Advertisement

Penamaluru Assembly Constituency Survey: పెనమలూరులో ఎవరికి ఎర్త్..? ఎవరికి బెర్త్..?

Penamaluru Assembly Constituency Survey: పెనమలూరులో ఎవరికి ఎర్త్..? ఎవరికి బెర్త్..?
Andhra politics news

Penamaluru Assembly Constituency Survey: ఏపీలో పెనమలూరు రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గా నడుస్తున్నాయి. 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఉయ్యూరు నియోజకవర్గం నుంచి వేరుపడి పెనమలూరు ఏర్పాటైంది. ఈ సెగ్మెంట్ ఏర్పడినప్పటి నుంచి ఏ పార్టీ కూడా రెండుసార్లు గెలవలేకపోయింది. 2009లో కాంగ్రెస్ గెలిస్తే, 2014లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. 2019లో వైసీపీ అభ్యర్థిగా పార్థసారథి గెలిచారు. మరి ఈసారి పెనమలూరు నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

పార్థసారథి వైసీపీ గెలుపు VS బోడె ప్రసాద్


2019 అసెంబ్లీ ఎన్నికల్లో పెనమలూరులో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పార్థసారథికి 47 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ కు 42 శాతం ఓట్లు, ఇతరులకు 11 శాతం ఓట్లు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా జగన్, వైసీపీ వేవ్ పెనమలూరులో కూడా గట్టిగా పని చేయడంతో అప్పట్లో పార్థసారధి గట్టెక్కారు. మరోవైపు బోడె ప్రసాద్ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. మరి ఈసారి ఎన్నికల్లో పెనమలూరు సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

జోగి రమేశ్ (YCP)ప్లస్ పాయింట్స్

ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు
ప్రజల్లో పాజిటివ్ మైండ్ సెట్
పెనమలూరులో యాక్టివ్ గా ప్రచారాలు

జోగి రమేశ్ మైనస్ పాయింట్స్

పెడన నుంచి పెనమలూరు మార్పు సమస్య
పెనమలూరు వైసీపీ నేతల వ్యతిరేకత
జోగి రమేశ్ నాన్ లోకల్ అన్న వాదన
కీలక నేత పడమట సురేశ్ బాబు సపోర్ట్ పై డౌట్లు
క్యాడర్ సపోర్ట్ ఎంత వరకు ఉంటుందన్న అనుమానం

బోడె ప్రసాద్(TDP) ప్లస్ పాయింట్స్

సీనియర్ టీడీపీ నేతగా జనంలో ఇమేజ్
గత ఎన్నికల్లో ఓడినా సెగ్మెంట్ లో యాక్టివ్
గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి
గ్రౌండ్ లో ప్రస్తుతం యాక్టివ్ గా కార్యకలాపాలు
యూత్ లో ప్రత్యేక గుర్తింపు
టీడీపీ క్యాడర్ సపోర్ట్ ఉండడం

బోడె ప్రసాద్ మైనస్ పాయింట్స్

జోగి రమేశ్ ను ఏమేరకు ఎదుర్కొంటారన్న డౌట్లు

ఇక వచ్చే ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

జోగి రమేశ్ VS బోడె ప్రసాద్

ఇప్పటికిప్పుడు పెనమలూరులో ఎన్నికలు జరిగితే టీడీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ కు 49 శాతం ఓట్లతో విజయం సాధించే ఛాన్సెస్ ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. అలాగే వైసీపీ నుంచి బరిలో దిగే జోగి రమేశ్ కు 43 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇతరులకు 8 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఈసారి పెనమలూరులో టీడీపీ ఓట్ షేర్ పెరగడానికి కారణం జనసేనతో పొత్తు ఉండడం, ఈ సెగ్మెంట్ లో కాపు కమ్యూనిటీ జనాభా 14 శాతం ఉంది. వీరి ఓట్లు ఎన్నికల్లో కీలకం కాబోతున్నాయి. అలాగే కమ్మ వర్గం జనాభా 25 శాతంగా ఉంది. అలాగే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఉన్న వ్యతిరేకత కూడా టీడీపీ ఓట్ షేర్ పెరగడానికి కారణమని సర్వేలో జనం అభిప్రాయంగా తేలింది.

మరోవైపు వైసీపీ ఓట్ షేర్ కు లబ్దిదారుల ఓట్లే కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం అభ్యర్థిగా ఉన్న జోగి రమేశ్ నాన్ లోకల్ అన్న అభిప్రాయం జనంలో ఉంది. అలాగే పెనమలూరులో వైసీపీ ఫుల్ క్యాడర్ సపోర్ట్ ఇచ్చే పరిస్థితులు లేవన్నది గ్రౌండ్ రియాల్టీగా ఉంది. పార్థసారథి టీడీపీలోకి వెళ్లడంతో వైసీపీ నుంచి పడమట సురేష్ బాబు టిక్కెట్ ఆశించారు. కానీ జోగి రమేష్ ను ఇంఛార్జ్ గా నియమించడంతో సురేష్ బాబు వర్గమంతా ప్రస్తుతం సైలెంట్ అయింది. వీరిని ప్రసన్నం చేసుకోవడం, పెనమలూరులో నెగెటివిటీని ఎన్నికల నాటికి తగ్గించుకోవడంపై ఓట్ షేర్ ఆధారపడి ఉండనుంది.

Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

Big Stories

×