E-Paper
Advertisement

Boat : అవుకు జలాశయంలో పడవ బోల్తా.. ఇద్దరు మృతి..

Boat : అవుకు జలాశయంలో పడవ బోల్తా.. ఇద్దరు మృతి..
Advertisement

Boat : నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తుండగా పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరొకరు గల్లంతయ్యారు.

Advertisement

పడవ జలాశయంలోకి వెళ్లిన సమయంలో మొత్తం 12 మంది పర్యాటకులున్నారు. ఒక్కసారిగా నీరు లోపలికి రావడంతో పడవ బోల్తా పడిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ ప్రమాద సమాచారం తెలియగానే పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. 11 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

ఆశాబీ అనే మహిళ ఒడ్డుకు చేరిన తర్వాత ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురిని బనగానపల్లి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నూర్జహాన్‌ అనే మహిళ మృతిచెందారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఏడాదిలోపు వయసున్న ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వారిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన యువతిని షాజీదాగా గుర్తించారు.

Tags

Related News

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

Big Stories

Advertisement
×