E-Paper
Advertisement

Boat : అవుకు జలాశయంలో పడవ బోల్తా.. ఇద్దరు మృతి..

Boat : అవుకు జలాశయంలో పడవ బోల్తా.. ఇద్దరు మృతి..

Boat : నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తుండగా పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరొకరు గల్లంతయ్యారు.

పడవ జలాశయంలోకి వెళ్లిన సమయంలో మొత్తం 12 మంది పర్యాటకులున్నారు. ఒక్కసారిగా నీరు లోపలికి రావడంతో పడవ బోల్తా పడిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ ప్రమాద సమాచారం తెలియగానే పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. 11 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

ఆశాబీ అనే మహిళ ఒడ్డుకు చేరిన తర్వాత ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురిని బనగానపల్లి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నూర్జహాన్‌ అనే మహిళ మృతిచెందారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఏడాదిలోపు వయసున్న ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వారిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన యువతిని షాజీదాగా గుర్తించారు.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×