E-Paper
Advertisement

Boat : అవుకు జలాశయంలో పడవ బోల్తా.. ఇద్దరు మృతి..

Boat : అవుకు జలాశయంలో పడవ బోల్తా.. ఇద్దరు మృతి..
Advertisement

Boat : నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తుండగా పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరొకరు గల్లంతయ్యారు.

Advertisement

పడవ జలాశయంలోకి వెళ్లిన సమయంలో మొత్తం 12 మంది పర్యాటకులున్నారు. ఒక్కసారిగా నీరు లోపలికి రావడంతో పడవ బోల్తా పడిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ ప్రమాద సమాచారం తెలియగానే పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. 11 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

ఆశాబీ అనే మహిళ ఒడ్డుకు చేరిన తర్వాత ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురిని బనగానపల్లి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నూర్జహాన్‌ అనే మహిళ మృతిచెందారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఏడాదిలోపు వయసున్న ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వారిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన యువతిని షాజీదాగా గుర్తించారు.

Tags

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×