E-Paper
Advertisement

Boppana Bhava Kumar : విజయవాడలో వైసీపీకి షాక్.. లోకేశ్ తో బొప్పన చర్చలు..

Boppana Bhava Kumar : విజయవాడలో వైసీపీకి షాక్.. లోకేశ్ తో బొప్పన చర్చలు..
Advertisement
Boppana Bhava Kumar

Boppana Bhava Kumar : ఏపీలో టీడీపీకి మరో షాక్ తగలబోతోంది. మరో కీలక నేత ఆ పార్టీని వీడుతున్నారు. విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్‌ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అక్కడ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తో భేటీ అయ్యారు. బొప్పనతోపాటు ఆయన అనుచరులు వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు.

బొప్పన భవకుమార్ ఇప్పటికే విజయవాడలోని టీడీపీ కీలక నేతలతో చర్చలు జరిపారు. వంగవీటి రాధా, కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్‌ ను కలిసి చర్చించారు. మరోవైపు బొప్పనను బుజ్జగించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేసింది. దేవినేని అవినాష్‌, మరికొందరు వైసీపీ నేతలు రంగంలోకి దిగి చర్చించారు. అయితే వైసీపీలో తనకు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయని బొప్పన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆ పార్టీలో కొనసాగలేనని తేల్చి చెప్పారు.

Advertisement

బొప్పన భవకుమార్ ఎలాంటి షరతులు లేకుండానే టీడీపీ చేరతారని తెలుస్తోంది. 2019లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున బొప్పన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్‌ విజయం సాధించారు.

Related News

నడిరోడ్డుపై కుప్పగా నోట్ల కట్టలు.. అసలు ఏం జరిగింది? విశాఖ సిటీలో ఘటన

వెటర్నరీ శాఖలో ఉద్యోగాల భర్తీ.. ప్రభుత్వం జీవో వెనక్కి తీసుకోవడంపై వైసీపీ విమర్శలు, రంగంలోకి దిగిన మంత్రి

జనసేన క్లారిటీ.. జగన్‌ను బెంగళూరులో బాలినేని భేటీ వ్యవహారం, దీని వెనుక

ఏపీ గవర్నర్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..!

తిరుమల బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

తిరుపతి ప్రజలకు గుడ్ న్యూస్.. గ్రేటర్ మున్సిపల్‌గా తిరుపతి.. పెరిగిన డివిజన్లు!

విశాఖ పీఠంపై కూటమిలో టెన్షన్.. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య మేయర్ సీటు ఫైట్!

రోడ్లు, పార్కింగ్ కూడా ప్రభుత్వమే కట్టాలా? విశాఖ ఐటీ కంపెనీ వింత డిమాండ్లు!

Big Stories

Advertisement
×