E-Paper
Advertisement

Viveka Murder Case: వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. రీ ఇన్వెస్టిగేషన్‌ కు సీబీఐ కోర్టు ఆదేశాలు

Viveka Murder Case: వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. రీ ఇన్వెస్టిగేషన్‌ కు సీబీఐ కోర్టు ఆదేశాలు
Advertisement

Viveka Murder Case: మాజీ మంత్రి వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసును మళ్లీ పూర్తి దర్యాప్తు చేయాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత నాంపల్లి సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై కోర్టు బుధవారం తీర్పును వెల్లడించింది. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరపకపోతే అసలు నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందని సునీత తరఫున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు.

కీలక ఫోన్ సంభాషణపై దర్యాప్తునకు ఆదేశం

వివేక హత్య కేసులో దర్యాప్తు కొనసాగితే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని సునీత కోర్టుకు తెలిపారు. అలాగే సీబీఐని సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ వేసేలా ఆదేశించాలని కోరారు. వివేకా హత్య కేసులో ఏ2గా ఉన్న సునీల్‌ యాదవ్‌ సోదరుడు కిరణ్‌, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి సోదరుడు కుమారుడైన అర్జున్‌రెడ్డి మధ్య కీలక ఫోన్‌ సంభాషణ జరిగిందని సునీత తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. అర్జున్‌రెడ్డి, కిరణ్‌ యాదవ్‌ ఫోన్‌ సంభాషణలపై దర్యాప్తు చేస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. దర్యాప్తు కొనసాగించే అవకాశం లేదని నిందితుల తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు వివేకా హత్య కేసులో పాక్షిక దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అర్జున్‌రెడ్డి, కిరణ్‌ యాదవ్‌ ఫోన్‌ సంభాషణలపై దర్యాప్తునకు ఆదేశించింది.

Advertisement

Also Read: Pawan Kalyan: పంచాయతీ రాజ్ శాఖలో నూతన సంస్కరణలు.. ఒకేసారి 10 వేల మందికి పైగా పదోన్నతులు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 

లోతైన దర్యాప్తు అవసరం

వివేకా హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరగలేదని, పలు అంశాలపై దర్యాప్తు అసమగ్రంగా ఉందని నిందితుల చెబుతున్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సీబీఐ కోర్టుకు వివేకా కుమార్తె సునీతారెడ్డి నివేదించారు. వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలని సునీత నాంపల్లి సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై డిసెంబర్ 6న వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్ పై ఇవాళ సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించింది. సునీత తరఫున న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, ఎస్ గౌతం వాదనలు వినిపించారు. సునీత తరఫు న్యాయవాదుల వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు వివేకా హత్య కేసులో లోతైన దర్యాప్తు జరగాలని స్పష్టం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

Related News

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

Big Stories

Advertisement
×