E-Paper
Advertisement

Polavaram: పోలవరం హైట్.. ఢిల్లీలో డబుల్ గేమ్?

Polavaram: పోలవరం హైట్.. ఢిల్లీలో డబుల్ గేమ్?
Advertisement

Polavaram: పోలవరం ప్రాజెక్ట్ ఎత్తుపై పార్లమెంట్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రాజెక్ట్‌ ఎత్తు 45.72 మీటర్లని స్పష్టం చేసింది. రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 1980 నాటి గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డ్ ప్రకారం.. పోలవరం పూర్తి రిజర్వాయర్‌ ఎత్తు 45.72 మీటర్లు అని తెలిపారు. పోలవరం ఎత్తు తగ్గించాలని తమకు ఎలాంటి సమాచారం లేదని కేంద్రం సమాధానం ఇచ్చింది.

అయితే ఇటీవలే పార్లమెంటు సాక్షిగా పోలవరంపై కేంద్రం విరుద్ధమైన ప్రకటన చేసింది. మొదటి దశలో 41.15 మీటర్ల వరకు నీరు నిల్వ చేస్తామని ప్రకటించింది. గతవారం వైసీపీ ఎంపీ సత్యవతి లోక్ సభ లో అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సమాధానం ఇచ్చారు. తొలిదశ సహాయ, పునరావాసం ఈ ఏడాది ఫిబ్రవరికే పూర్తి కావాల్సి ఉందన్నారు ప్రహ్లాద్ సింగ్ పటేల్.
తొలిదశలో 20 వేల నిర్వాసిత కుటుంబాలకు సహాయ, పునరావాసం ఇవ్వాల్సి ఉందని.. దానిని కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదని ప్రహ్లాద్ సింగ్ పటేల్ అన్నారు.

Advertisement

పోలవరం ఎత్తుపై గతం వారం చేసిన కేంద్రం చేసిన ప్రకటనకు.. తాజాగా కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంలో స్పష్టత కరువైంది. మొదటి దశలో 41.45 మీటర్ల వరకు నీరు నిల్వ చేస్తామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ ప్రకటించగా.. సోమవారం కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ ప్రాజెక్ట్‌ ఎత్తు 45.72 మీటర్లని స్పష్టం చేసింది. పార్లమెంట్ లో కేంద్ర మంత్రుల పరస్పర విరుద్ధ ప్రకటనలతో.. పొలవరం ఎత్తు విషయంలో మరోసారి వివాదం రాజుకున్నట్లు అయింది.

Related News

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

Big Stories

Advertisement
×