BigTV English
Advertisement

TTD News: అదంతా అబద్దం.. అలా జరగలేదు.. టీటీడీ చైర్మన్ క్లారిటీ

TTD News: అదంతా అబద్దం.. అలా జరగలేదు.. టీటీడీ చైర్మన్ క్లారిటీ

TTD News: కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమలలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మర్షి డాక్టర్ చాగంటి కోటేశ్వరరావుకు అవమానం జరిగిందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో బ్రహ్మర్షి డాక్టర్ చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగిందని ప్రచారం అవుతున్న నేపథ్యంలో చైర్మన్ స్పందించారు.


చైర్మన్ ఇచ్చిన వివరణ మేరకు.. ప్రతి ఏడాది జనవరి మాసంలో డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు తిరుమల వచ్చి శ్రీవారిని సందర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అందులో భాగంగా జనవరి 14వ తేదీన శ్రీవారి దర్శనం, 16వ తేదీ సాయంత్రం తిరుపతి మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం డిసెంబర్ 20వ తేదీన ప్రొసీడింగ్స్ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ ప్రోటోకాల్ ఉండడంతో జనవరి 14వ తేదీన శ్రీవారి దర్శనం ఏర్పాట్లను టీటీడీ చేసిందని వివరణ ఇచ్చారు. అయితే రామ్ బగీచా గెస్ట్ హౌస్ నుండి శ్రీవారి ఆలయానికి తీసుకు వెళ్లేందుకు బగ్గీస్, అదేవిధంగా బయోమెట్రిక్ ద్వారా అనుమతించేందుకు కూడ టీటీడీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు.

వయసు రీత్యా శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా వెళ్లే సదుపాయం ఉన్నా, చాగంటి సున్నితంగా తిరస్కరించారని వివరణ ఇచ్చారు. సాధారణ భక్తుల తరహాలోనే వైకుంఠం కాంప్లెక్స్ నుండి శ్రీవారి ఆలయానికి చేరాలని స్వయంగా చాగంటి సూచించినట్లు తెలిపారు. ఆ సూచనతోనే వారే స్వయంగా వైకుంఠ కాంప్లెక్స్ నుండి ఆలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారన్నారు.


Also Read: DCM Pawan Kalyan: రంగంలోకి పవన్ కళ్యాణ్.. అవినీతి అధికారులకు ఇక చుక్కలే

అలాగే జనవరి 8వ తేదీన తిరుపతిలో జరిగిన తోపులాట ఘటన నేపథ్యంలో చాగంటి ప్రవచన కార్యక్రమాన్ని మరువ తేదీకి వాయిదా వేస్తే బాగుంటుందని టీటీడీ అధికారులు సూచించారని, దీనితో మరోసారి ఆయన తేదీలను తీసుకుని ప్రవచనాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. అయితే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుండి శ్రీవారి ఆలయంలోకి అనుమతించారని, చివరి నిమిషంలో పరిపాలనా కారణాల రీత్యా చాగంటి ప్రవచనాల కార్యక్రమాన్ని టీటీడీ రద్దు చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని చైర్మన్ ఖండించారు. ఇటువంటి ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Related News

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

Big Stories

×