E-Paper
Advertisement

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు
Advertisement

Chandhrababu: వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు మరోసారి ఫైరయ్యారు.  ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రకాశం జిల్లాలో పర్యటించారు. నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ పథకాల గురించి ఆయన అక్కడి ప్రజలకు వివరించారు.

అనంతరం ఆయన జగన్ పై మండిపడ్డారు. ‘వైసీపీని భూస్థాపితం చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా కూటమికి ఘన విజయాన్ని అందించారు. ప్రజలు 21 మంది ఎంపీలను గెలిపించారు. దాని వల్లే ఢిల్లీలో మన పరపతి పెరిగింది. గతం సీఎం పరదాల చాటున వెళ్లేవారు. అప్పటి సీఎం జగన్ ను చూస్తే ఆశ్చర్యంగా అనిపించేది. ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా?

Advertisement

ప్రతి నెలా మొదటి తేదీనే ఇంటికి వెల్లి పెన్షన్లు అందజేస్తున్నాం. ప్రతి ఒక్కరికీ రూ. 4 వేల పెన్షన్లను పెంచాం. ఒకేసారి రూ. 2 వేల పెన్షన్ పెంచింది టీడీపీ ప్రభుత్వమే. గతంలో కేంద్రం ఇచ్చిన డబ్బులను కూడా వైసీపీ ప్రభుత్వం డైవర్ట్ చేసింది

Also Read: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Advertisement

భక్తులు తిరుమల కొండకు వెళ్లడం మానేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా జగన్ కల్తీ చేశాడు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను జగన్ దెబ్బ తీశాడు. వైసాపీ హయాంలో ప్రసాదం బాగుందా? క్షమించరాని నేరం చేసినవారిని వదిలిపెట్టం. తిరుమల లడ్డూలో నాసిరకమైన నెయ్యిని వాడారు. శ్రీవారి ప్రసాదంలో కల్తీ పదార్థాలు వాడారు. వైసీపీ పాలనలో దర్శనాలు, భోజనాలు కూడా సరిగా లేవు’ అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులకు ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు. పేదల ఇళ్లకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకోవాలన్నారు. వారు ఏమైనా ఇబ్బందుల్లో వారికి ఆదుకోవాలని సూచించారు. ప్రతి నెల ఒకటో తేదీన ‘పేదల సేవలో’ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రంలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల ఇంటి వద్దకు వెళ్లి వారి కష్టాలను తెలుసుకుని అవసరమైన సాయం అందించాలన్నారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×