E-Paper
Advertisement

Inquiry on Sakshi Newspaper: జగన్ చిక్కినట్టేనా.. క్విడ్ ప్రోకో, సాక్షి పత్రిక కొనుగోళ్లపై

Inquiry on  Sakshi Newspaper: జగన్ చిక్కినట్టేనా.. క్విడ్ ప్రోకో, సాక్షి పత్రిక కొనుగోళ్లపై

Inquiry on Sakshi Newspaper: జగన్ టార్గెట్‌గా చంద్రబాబు సర్కార్ పావులు కదుపుతోందా? ప్రజాధనాన్ని జగన్ సర్కార్ దుర్వినియోగం చేసిందా? క్విడ్ ప్రోకో ద్వారా సాక్షి పత్రిక కొనుగోళ్లు చేయించిందా? బుధవారం చంద్రబాబు కేబినెట్ సమావేశంలో ఎలాంటి చర్చ జరిగింది? విచారణ చేపట్టాలని మంత్రులే స్వయంగా సీఎం చంద్రబాబుకు చెప్పారా? జగన్‌కు మరిన్ని కష్టాలు తప్పవా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

మాజీ సీఎం జగన్ అడ్డంగా దొరికిపోయారు. సాక్షి పేపర్‌ను కొనుగోలు కోసం ప్రభుత్వ ఖజానా నుంచి ఏకంగా గడిచిన రెండేళ్లలో 205 కోట్ల రూపాయలు కేటాయించింది. వాలంటీర్ల ద్వారా సాక్షి పేపర్‌ను కొనుగోలు చేయింది గత వైసీపీ సర్కార్. పత్రికను కొనుగోలు చేసేందుకు వీలుగా వాలంటీర్లకు నెలకు 200 రూపాయలు చొప్పున రెండేళ్ల పాటు ఆ మొత్తాన్ని కేటాయించింది. అక్షరాలా దాని విలువ 205 కోట్ల రూపాయలు.

కేవలం ఒక్క పత్రికను మాత్రమే కొనుగోలు చేసింది. గత సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, పట్టణ సచివాలయాలను ఏర్పాటు చేసింది.  వాటికి కేవలం సాక్షి పేపర్ మాత్రమే వచ్చేది. ఇందుకోసం జగన్ సర్కార్ 205 కోట్ల రూపాయలను కేటాయించింది. మిగతా పత్రికలు రాకుండా చేయడంతో అడ్డంగా దొరికిపోయింది అప్పటి ప్రభుత్వం. మరో విషయం ఏంటంటే.. చాలా మున్సిపాలిటీల్లో సాక్షి పేపరు కొనుగోలు చేసేందుకు ఏడాదిపాటు అడ్వాన్సు ముందుగానే ఇచ్చినట్టు అంతర్గత సమాచారం.

Also Read: ఒక్క ‘సాక్షి’కే రూ.300 కోట్లా? అంటే ఐదేళ్లలో..? అయ్య బాబోయ్, జగన్ మామూలోడు కాదు!

సింపుల్ చెప్పాలంటే ఓపెన్‌గా క్విడ్ ప్రోకో చేశారన్నది మంత్రుల మాట. ప్రభుత్వం ఖజానా నుంచి సాక్షి పేపర్ కొనుగోలు చేయించడం, తద్వారా దాని సర్కులేషన్ పెంచడం, ప్రభుత్వ ప్రకటనలు కేవలం సాక్షికి 440 కోట్ల రూపాయలు కేటాయించడం వెనుక అసలు కథ అని చెబుతున్నారు.

ఈ వ్యవహారంపై జగన్ సర్కార్‌ ఇరుక్కోవడం ఖాయమనే వార్తలు జోరందు కున్నాయి. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో దీనిపై ప్రధానంగా దాదాపు అరగంటకు పైగానే మంత్రులు చర్చించారు. ఇందులో నిజాలు నిగ్గు తేల్చాలంటే విచారణ చేయించాలని మంత్రులు చెప్పడంతో సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు.

గడిచిన ఐదేళ్లలో వైసీపీ సర్కార్ కేవలం ప్రకటన కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఐదేళ్లలో ఒక్క సాక్షికి ప్రకటన రూపంలో 403 కోట్ల రూపాయలను అసెంబ్లీ సమావేశంలో సమాచార శాఖ మంత్రి పార్థసారథి బహిరంగ ప్రకటన చేశారు.

ఒక్క సాక్షికి 403 కోట్ల రూపాయల ప్రకటనలు ఇవ్వగా, మిగతా 20 పత్రికలకు ఇచ్చిన ప్రకటన మొత్తం 488 కోట్లు. ఈ లెక్కన సాక్షిదే అగ్రభాగం అన్నమాట. ఈ వ్యవహారంపై ఈనాడు సంస్థ న్యాయస్థానం పిటిషన్ దాఖలు చేసింది కూడా.

కేవలం సాక్షికి అధికంగా ప్రకటనలు ఇవ్వడంపై డిపార్టుమెంట్ విచారణ జరుగుతోంది. వీటిలో చాలా పత్రికలకు నిధులు విడుదల చేయలేదు. గతంలో డిప్యూటేషన్‌పై వచ్చిన పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్‌రెడ్డి వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. మొత్తానికి సాక్షి పత్రిక వ్యవహారంపై చంద్రబాబు సర్కార్ తీగ లాగితే డొంక కదులుతోందని చెప్పవచ్చు. రాబోయే దీనిపై ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

ALSO READ:  దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×