E-Paper
Advertisement

AP Rajya Sabha Elections 2024: రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరం.. వైసీపీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం..!

AP Rajya Sabha Elections 2024: రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరం.. వైసీపీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం..!
YCP party latest news

Chandrababu Clarity on TDP Contest in Rajya Sabha Elections 2024(AP news live): ఏపీలో రాజ్యసభ ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. మూడు స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకోనుంది. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. ఇక వైసీపీ అభ్యర్థుల విజయం లాంఛనమే కానుంది.

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉండవల్లిలో తన నివాసంలో పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహన్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ తో భేటీ అయ్యారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై చర్చించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే యోచన లేదని పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టతనిచ్చారు.

‘‘రా కదలి రా’’ సభలు, లోకేష్ ‘‘శంఖారావం’’ పై ఈ సమావేశంలో చంద్రబాబు చర్చించారు. ఎన్నికలకు ఇక 56 రోజులే ఉందని నాయకులు పూర్తిగా యాక్టివ్ కావాలని చంద్రబాబు సూచించారు. వైసీపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారని జరుగుతున్న ప్రచారంపై పార్టీ నాయకులు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. వైసీపీ కీలక నేతలు టచ్‌లోకి వచ్చిన మాట నిజమేనని క్లారిటీ ఇచ్చారు.

Read More: అయ్యోపాపం సుబ్బారెడ్డిని అపార్థం చేసుకున్నామా? ఉమ్మడి రాజధానిపై వైసీపీ యూటర్న్..

వైసీపీ నుంచి వచ్చిన అందరినీ తీసుకోలేమని కూడా చంద్రబాబు తేల్చిచెప్పారు పొత్తులు, కొత్తగా నేతల చేరికల వల్ల పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడి పనిచేస్తున్న నేతల రాజకీయ భవిష్యత్‌కు నష్టం జగరకుండా చూస్తానని హామీ ఇచ్చారు. తొలు నుంచి పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని భరోసా కల్పించారు.

వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థులుగా గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డిలను సీఎం వైఎస్ జగన్ ఎంపిక చేశారు. ఆ తర్వాత ఈ ముగ్గురు నేతలు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జగన్ ను కలిశారు. వారికి ముఖ్యమంత్రి బీ–ఫారాలు ఇచ్చారు. అనంతరం ఈ ముగ్గురు అభ్యర్థులు సోమవారు నామినేషన్ల సమర్పించారు. టీడీపీ పోటీకి దూరంగా ఉండటంతో వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×