E-Paper
Advertisement

Chandrababu: ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తొలి సంతకం ఏ ఫైల్‌పై పెట్టారంటే..?

Chandrababu: ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తొలి సంతకం ఏ ఫైల్‌పై పెట్టారంటే..?
Advertisement

Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. సీఎంగా  ప్రమాణస్వీకారం చేసిన తరువాత చంద్రబాబు తొలిసారిగా గురువారం సచివాలయానికి వచ్చారు. తన నివాసం నుంచి బయలుదేరి నేరుగా సచివాలయానికి చేరుకున్నారు. అనంతరం ఆయన బాధ్యతలు తీసుకున్నారు. సరిగ్గా సాయంత్రం 4.41 గంటలకు తన ఛాంబర్ లో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన పలు హామీలకు సంబంధించిన ఫైళ్లపై చంద్రబాబు సంతకం చేశారు.

మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ తోపాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ముఖ్యమంత్రి హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు స్వాగతం పలికారు.

Advertisement

Also Read: జగన్ బొమ్మ ఉన్నా పర్లేదు.. కిట్లు పంపిణీ చేయండి : సీఎం చంద్రబాబు

మొత్తం ఐదు ఫైళ్లపై ఆయన సంతకం చేశారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ ఫైల్ పై మొదటి సంతకం చేశారు. ఆ తరువాత, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన ఫైల్ పై రెండో సంతకం చేశారు. ఈ యాక్ట్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గత ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటు 3వ ఫైల్.. రూ. 4 వేలకు పెన్షన్ల పెంపునకు సంబంధించిన ఫైల్ పై చంద్రబాబు మూడవ సంతకం చేశారు. అనంతరం.. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైల్ పై నాలుగో సంతకం చేశారు. చివరగా ఐదో సంతకం.. నైపుణ్య గణనకు సంబంధించిన ఫైల్ పై చేశారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×