E-Paper
Advertisement

CM Chandrababu: తన రికార్డ్ తనే తిరగరాసిన సీఎం చంద్రబాబు.. 10 సార్లు పైగానే శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ

CM Chandrababu: తన రికార్డ్ తనే తిరగరాసిన సీఎం చంద్రబాబు.. 10 సార్లు పైగానే శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
Advertisement

CM Chandrababu: ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మరో రికార్డు సృష్టించనున్నారు. ఇప్పటివరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరై.. స్వామివారికి పట్టు వస్త్రాలు అధిక సార్లు సమర్పించిన సీఎంగా చంద్రబాబు చరిత్ర కెక్కనున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో ప్రభుత్వం తరఫున.. సీఎం హోదాలో ఉన్న నేత పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ అనంతరం.. శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా.. నేడు సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలను స్వామి వారికి సమర్పించనున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లను సైతం పూర్తి చేశారు.

ఏడాదికి ఒకసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. ఈ బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుండే కాక దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటారు. అంతేకాకుండా విదేశీయులు సైతం శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొనడాన్ని.. పుణ్యకార్యంగా భావిస్తారు. అందుకే ఈ ఏడాది కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఈవో శ్యామల రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Advertisement

Also Read: Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాలకు ముందు అపశృతి.. టీటీడీ అలర్ట్..

కాగా శ్రీవారికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ 1978 నుండి ప్రారంభమైందని తెలుస్తోంది. తొలిసారిగా శ్రీవారికి నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి, స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం కొన్నేళ్లు స్వామివారికి పట్టు వస్త్రాలను ఆలయ అధికారులే సమర్పించగా, 1984లో ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారక రామారావు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీని పునః ప్రారంభించారు. ఇలా చంద్రబాబు సైతం సీఎం హోదాలో 2003లో పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుమలకు వెళుతున్న క్రమంలో అలిపిరి వద్ద జరిగిన బాంబు పేలుళ్ల నుండి అదృష్టవశాత్తు బయటపడ్డారు. తనకు తిరుమలేశుడు పునర్జన్మ ఇచ్చినట్లు బాబు నాడు ప్రకటించారు.

Advertisement

ఇలా తమ ఇంటి ఇలవేల్పుగా తిరుమల శ్రీ శ్రీనివాసుడిని సీఎం చంద్రబాబు పూజిస్తారు. తాజాగా జరిగిన ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం చంద్రబాబు తిరుమల పర్యటనకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే తన పరిపాలన ప్రక్షాళన తిరుమల నుండే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 1995 లో నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం 1999-2004, 2014-19 సంవత్సరాలలో సీఎంగా గల బాబు.. ఆ పదేళ్ళ కాలంలో స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తాజా గెలుపుతో నాల్గవసారి సీఎంగా గెలుపు అందుకున్న చంద్రబాబు.. ప్రస్తుతం జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇప్పటికి పది సార్లకు పైగా.. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎంగా చంద్రబాబుకు రికార్డు సొంతమైందని చెప్పవచ్చు.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×