E-Paper
Advertisement

CM Chandrababu: ఎట్టకేలకు ఫలించిన చంద్రబాబు కృషి.. కుప్పంలో కృష్ణమ్మకు సీఎం జలహారతి

CM Chandrababu: ఎట్టకేలకు ఫలించిన చంద్రబాబు కృషి.. కుప్పంలో కృష్ణమ్మకు సీఎం జలహారతి
Advertisement

CM Chandrababu: ఎట్టకేలకు.. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి ఫలించింది. కుప్పం నియోజకవర్గంలో కృష్ణమ్మ జల సవ్వడులు కనిపించబోతున్నాయ్. 19 నియోజకవర్గాలని తాకుతూ.. 738 కిలోమీటర్లు ప్రయాణించి.. కృష్ణమ్మ కుప్పానికి చేరుతోంది. శ్రీశైలం నుంచి బయల్దేరి.. 10 రిజర్వాయర్లని నింపుతూ కుప్పం దాకా చేరుతున్నాయ్ కృష్ణా నీళ్లు. రాయలసీమని.. కోనసీమగా మార్చేలా.. రికార్డు టైమ్లో.. హంద్రీ-నీవా విస్తరణ పనులు పూర్తి చేశారు.

హంద్రీనీవా కాలువల్లో కృష్ణమ్మ ప్రవాహం
గత నెల 17న కర్నూలు జిల్లా మాల్యాల ఎత్తిపోతల నుంచి కుప్పానికి నీటిని విడుదల చేశారు. నాటి నుంచి హంద్రీనీవా కాలువల్లో ప్రవహించిన కృష్ణమ్మ.. 738 కిలోమీటర్లు ప్రయాణించి.. కుప్పానికి చేరింది. ఈ శనివారమే.. కుప్పంలో కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్నారు సీఎం చంద్రబాబు.

Advertisement

సీమ పల్లెల్లోకి నీళ్లు పారించారు చంద్రబాబు
అతి తక్కువ వర్షపాతం ఉండే సీమ జిల్లాల్లో.. నీళ్లతోనే సీమ ప్రజల స్థితిగతులు మారుతాయని.. ఇరిగేషన్‌కి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో హంద్రీ నీవా విస్తరణ పనులు పూర్తి చేసి.. బీడు భూముల్లోనూ నీళ్లు పారేలా చేశారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడే.. సాగునీటి ప్రాజెక్టులపై భారీ ఎత్తున నిధులు ఖర్చు చేశారు.

హంద్రీనీవా ప్రాజెక్టుపై రూ.4,183 కోట్లు ఖర్చు..
హంద్రీనీవా ప్రాజెక్టుపై.. తెలుగుదేశం ప్రభుత్వం 4 వేల 183 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టును పరుగులు పెట్టించింది. అందుకే.. హంద్రీనీవా నీళ్లు ఇప్పుడు చిత్తూరు జిల్లాలో చివరి భూముల దాకా చేరాయని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ సీజన్‌లో ఎలాగైనా నీళ్లివ్వాలనే లక్ష్యంతో.. పనుల్లో వేగం పెంచారు. రికార్డు స్థాయిలో కేవలం 100 రోజుల్లో మెయిన్ కెనాల్ విస్తరణ, లైనింగ్ పనులు పూర్తి చేసి.. ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3850 క్యూసెక్కులకు పెంచారు. ఇప్పుడు హంద్రీనీవా కాల్వ విస్తరణతో.. సీమకు జలకళ వచ్చిందనే చర్చ జరుగుతోంది.

Advertisement

Also Read: మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి అరెస్ట్..

కృష్ణా జలాలకు హారతి.. సంబరాలు చేసుకుంటున్న ప్రజలు..
హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందుతోంది. విస్తరించిన కాల్వల ద్వారా పరుగులు పెడుతోన్న కృష్ణమ్మ.. 19 నియోజకవర్గాలను తాకుతూ.. 10 రిజర్వాయర్లలని నింపుతోంది. హంద్రీనీవా ఆయకట్టులో చివరి జిల్లా చిత్తూరు. ఈ జిల్లాలో 16 లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నా.. కేవలం 6 లక్షల ఎకరాలకే సాగునీరు అందుతోంది. ఇప్పుడు.. హంద్రీనీవా రెండో దశ పనులు పూర్తి చేసి జిల్లాలోని 2 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తారు. కుప్పంలోని పరమ సముద్రంలో.. సీఎం చంద్రబాబు కృష్ణా జలాలకు హారతి ఇచ్చారు. తమకోసం తరలివచ్చిన కృష్ణమ్మని చూసి సంబరాలు చేసుకుంటున్నారు.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×