E-Paper
Advertisement

Chandrababu : ఏపీని కాపాడుకుందాం..! ప్రజలకు చంద్రబాబు పిలుపు..

Chandrababu : ఏపీని కాపాడుకుందాం..! ప్రజలకు చంద్రబాబు పిలుపు..

Chandrababu Mahanadu Speech(Latest news in Andhra Pradesh): తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మహానాడు వేదికపై నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎవరూ మనల్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. అడ్డుకుంటే తొక్కుకుంటూ ముందుకెళతామని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రస్తుతం ఏపీలో దుర్మార్గపు పాలన సాగుతోందని చంద్రబాబు మండిపడ్డారు.

టీడీపీని దెబ్బతీద్దామని చాలామంది ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు. కానీ వారి ప్రయత్నాలు సఫలం కాలేదన్నారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులకు నెలవారీ జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేదని విమర్శించారు. వారికి పీఆర్సీ కూడా ఇవ్వలేదన్నారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు.

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కాపాడానికే 60 ఏళ్ల వయస్సులో ఎన్టీఆర్ రాజకీయాల్లో వచ్చారని స్పష్టం చేశారు. పార్టీ పెట్టి అతి తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చారని తెలిపారు. ఎన్టీఆర్ ను యుగపురుషుడిగా పేర్కొన్నారు. ఆ మహనీయుడి పేరు చెబితే సంక్షేమ పథకాలే గుర్తొస్తాయన్నారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించారని తెలిపారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×