BigTV English
Advertisement

CM Chandrababu: ఐదేళ్లు లేని ఆనందాలను.. ఆరు నెలల్లో అందించాం.. సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఐదేళ్లు లేని ఆనందాలను.. ఆరు నెలల్లో అందించాం.. సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఏపీలో సంక్రాంతి పండుగను ప్రజలు ఆనందంగా జరుపుకున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలను సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆరు నెలల వ్యవధిలో ప్రభుత్వం చేపట్టిన అన్ని పనుల గురించి వివరించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే తలసరి ఆదాయం ఎక్కువగా సాధించిన రాష్ట్రం ఏపీ అంటూ పేర్కొన్నారు.


రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ 2 లక్షల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారన్నారు. ఉద్యోగ అవకాశాలు మనం అడగడం కాదు.. ఉద్యోగాలను కల్పించి ఇతర రాష్ట్ర యువతకు కూడా ఉపాధినిచ్చే రాష్ట్రంగా ఏపీ అభివృద్ధి పథంలో నడుస్తుందని చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రమంతా నెలకు 3 యూనిట్లు ఉత్పత్తి చేసుకునేందుకు అవసరమైన సోలార్ యూనిట్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపుతుందన్నారు.

సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ బకాయిలు రూ. 6700 కోట్లు విడుదల చేసి, పోలవరం నిర్వాసితులకు పరిహారం అందజేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను సైతం పరిష్కరించామన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 125 కోట్లు ఒకేరోజు మంజూరు చేసి సామాన్య ప్రజలకు ఆర్థికంగా అండగా నిలిచామని చంద్రబాబు తెలిపారు. అంతేకాకుండా ధాన్యం అమ్మిన రైతులకు 24 గంటల్లో వారి నగదు వారికి జమ చేసేలా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, రైతులు ఈ చర్య పై ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు అద్వాన్నంగా ఉన్న రహదారులను అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించి ఇటీవల ప్రతి పల్లెకు రహదారులను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.


Also Read: AP Govt: దీపం 2.o పథకంపై ప్రభుత్వం కీలక ప్రకటన.. ఇలా తప్పక చేయండి

అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుకు సాగుతుందని, విజన్ 2047 కు అనుగుణంగా ప్రభుత్వం నడుస్తుందన్నారు. సంక్రాంతి పండుగకు ప్రతి పల్లె ప్రతి ఇల్లు సంతోషంగా ఉందని, గత ఐదేళ్లలో ఈ స్థాయి ఆనందం రాష్ట్ర ప్రజల్లో లేదన్నారు. దేశంలోని 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనంటూ చంద్రబాబు తెలిపారు. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, ప్రతినెలా పింఛన్ పంపిణీ, ఇలా ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం విజయవంతంగా సాగిస్తుందన్నారు. ఏపీలో కాలుష్య రహిత సమాజం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటుందని అందుకు ప్రజలు కూడా పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. నారవారి పల్లెకు సీఎం చంద్రబాబు వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామానికి చేరుకున్నారు.

Related News

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

AP Politics: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్ రూ.400 కోట్ల బంగారం కొనుగోలు

AP Politics: జగన్ టూర్లు.. బుక్కవుతున్న వైపీసీ నేతలు.. బెంబేలెత్తుతున్నారెందుకు?

Heavy Rain Alert: రెయిన్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షం.. బయటకు వచ్చారో ముంచేస్తుంది..

Big Stories

×