E-Paper
Advertisement

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ భేటీ, విస్తరణ ప్రణాళిక..

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ భేటీ, విస్తరణ ప్రణాళిక..

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ సమావేశయ్యారు. శుక్రవారం ఉదయం అమరావతిలో ఇరువురు భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగానే వివిధ అంశాలపై చర్చించారు. చంద్రబాబు సర్కార్ విజన్ గురించి అడిగి తెలుసుకున్నారు. దేశంలో పేరున్న పారిశ్రామిక వేత్తలతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు కానుంది. దీనికి కో-ఛైర్మన్‌గా చంద్రశేఖరన్ వ్యవహరించనున్నారు.

ఏపీలో పెట్టుబడుల గురించి సీఎం చంద్రబాబు-టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ మధ్య చర్చలు జరిగా యి. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047 రూప కల్పన అంశాలపై మాట్లాడారు. పారిశ్రామిక అభివృద్ధికి సూచన లు, సలహాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుంది చంద్రబాబు సర్కార్. దీనికి కో-ఛైర్మన్‌గా చంద్రశేఖరన్ వ్యవహరించనున్నారు.

అమరావతిలో సీఐఐ భాగస్వామ్యంతో నెలకొల్పనున్న గ్లోబల్ లీడర్‌షిప్ సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందులో టాటా గ్రూపు భాగస్వామి కానుంది. విశాఖలో టీసీఎస్ సెంటర్ ఏర్పాటు, ఎయిరిండియా, విస్తారా ఎయిర్‌లైన్స్ విస్తరణ అంశాలపై సీఎం చంద్రబాబుతో మంతనాలు జరిపారు. మరోవైపు సోలార్, టెలికమ్యూనికేషన్స్, ఫుడ్ ఫ్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపైనా చర్చ జరిగినట్టు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×