Amaravati: దేశ మనుగడ ఉన్నంతవరకు అంబేద్కర్ మన మదిలో ఉంటారన్నారు సీఎం చంద్రబాబు. రాజ్యాంగం గొప్పతనాన్ని ప్రతీ పౌరుడికి చెప్పాలన్నారు. కొన్ని దేశాల్లో బలహీన వర్గాలకు ఓటుహక్కు కల్పించలేదన్నారు. అమెరికాలో ఎప్పుడూ మహిళలు ప్రెసిడెంట్ కాలేదన్నారు. ఛాయ్ వాలా దేశానికి ప్రధాని కావడం రాజ్యాంగం మనకు ఇచ్చిన అవకాశమన్నారు.
ఆనాడు అనుకున్నా.. సాధించా-సీఎం చంద్రబాబు
గిరిజన మహిళ దేశానికి రాష్ట్రపతి అయ్యారని వివరించారు. రాజ్యాంగం మనకు హక్కులు, విధులను కల్పించిందన్నారు. రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో మాక్ అసెంబ్లీ కార్యక్రమం జరిగింది. మాక్ అసెంబ్లీలో విద్యార్థులు చాలా బాగా మాట్లాడారని అన్నారు. ఎక్కడా తడబడకుండా పిల్లలు మాట్లాడడం బాగుందన్నారు.
విజన్ ఉంటే సరిపోదని, దాన్ని అమలు చేయడం ముఖ్యమన్నారు. నిరంతరం శ్రమ పడితేనే అనుకున్నది సాధించగలమన్నారు. 28 ఏళ్లకు తాను ఎమ్మెల్యే అయ్యానని అన్నారు సీఎం చంద్రబాబు. చదువుకునేటప్పుడు తాను బ్రిలియంట్ స్టూడెంట్ కాదన్నారు. మా సార్ తనకు లెక్చరర్ గా అవకాశం ఇచ్చారని, ఎమ్మెల్యే కావాలని కోరికతో ఆ పోస్టుని తిరస్కరించానన్నారు.
మాక్ అసెంబ్లీలో విద్యార్థుల స్పీచ్ అదుర్స్
ప్రజా ప్రతినిధి అయితే ఐఏఎస్ లను కూడా ఆదేశించనవచ్చని ఆరోజు అనుకున్నానని వివరించారు. 9 సార్లు ఎమ్మెల్యే అయ్యానని, 45 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నట్లు చెప్పుకొచ్చారు. మంత్రి లోకేష్ రెవల్యూషనరీ థింకింగ్ చేస్తారని తెలిపారు. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుని ముందుకెళ్లాలన్నారు. సరైన నిర్ణయాలు తీసుకుంటేనే సాధ్యమవుతుందన్నారు. తాను నాలుగోసారి ముఖ్యమంత్రిగా పని చేస్తున్నానని తెలియజేశారు.
ఓటు హక్కు కల్పించని చోట, పోరాటాలు చేసి ఓటు హక్కు సాధించారని గుర్తు చేశారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఏకైక దేశం భారత్ అని అన్నారు. ప్రాథమిక హక్కులతో పాటు బాధ్యతలు కూడా రాజ్యాంగం ఇచ్చిందన్నారు. చాలామంది హక్కులపై మాట్లాడుతారని, బాధ్యతలపై మాట్లాడరని తెలియజేశారు.
ALSO READ: అధ్యక్షా అంటూ సీఎం చంద్రబాబు ముందు అదరగొట్టిన చిన్నారులు
గతంలో తనను ఇబ్బంది పెట్టినప్పుడు రాజ్యాంగం పుస్తకం పట్టుకుని నడిచానని అన్నారు మంత్రి లోకేష్. రాజ్యాంగ పుస్తకం చదివితే అదంటే ఏంటో మాకు తెలియదని పోలీసులు అన్నారని తెలిపారు. అప్పుడే నిర్ణయించుకున్నా ప్రతి పిల్లోడి దగ్గర ఈ బుక్ ఉండాలి అని, రాజ్యాంగ హక్కులు వారికి తెలియజేయాలన్నారు.