Jonnagiri Gold Mine: దేశంలో బంగారు గనుల పేరు చెప్పగానే కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గుర్తుకొస్తాయి. ఈ ప్లాంట్పై తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద సూపర్హిట్ అయ్యాయి. ఆ ప్లాంట్ మూతపడిన తర్వాత దేశీయంగా పసిడి ఉత్పత్తి జీరోకి చేరింది. తాజాగా రాయలసీమ స్వర్ణగిరిగా మారబోతోంది. కేజీఎఫ్ తర్వాత దేశంలో జేజీఎఫ్(జొన్నగిరి గోల్డ్ మైన్స్)ని ఇవాళ సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
విజయనగరం సామ్రాజ్యంలో వజ్రాలను కొనుగోలుకు విదేశీయులు వచ్చేవారని చరిత్రకారులు చెబుతారు. అదంతా గతం.. ఇక వర్తమానంలోకి వచ్చేద్దాం. రాయలసీమ బంగారం అమ్మకాలకు కేరాఫ్గా మారబోతోంది. బుధవారం జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టుని ప్రారంభించినున్నారు సీఎం చంద్రబాబు.