Chintada Ravi: జగన్ పర్యటనలో ఎస్సై పై అనుచితంగా ప్రవర్తించారంటూ ఆమదాలవలస వైసిపి ఇంచార్జ్తో సహా మరో 20 మందిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అయితే పరారీలో ఉన్న చింతాడ రవి చిలకపాలేం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. మరో వైపు ఇదే కేసులో తొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. చింతాడ రవితో పాటు మిగిలిన తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసి పోలీసులు జడ్జి ముందు హజరు పరిచారు. దీంతో జడ్జి అరేస్ట్ చేసిన 9 మందికి 14 రోజుల పాటు రిమాండ్ విధించాడు.
Also Read: కూతురు కోసం హంతకుడిని నిర్దోషిగా… ఓటీటీని దద్దరిల్లేలా చేసిన కోర్ట్రూమ్ థ్రిల్లర్ తెలుగులో
అయితే చితాడ రవి పరారీలో ఉన్న సమయంలో చింతాడ రవి కోర్టులో సరేండర్ అవుతారన్న సమాచారముతో నేడు కోర్టు పరిసర ప్రాంతాల్లో బారీగా పోలీసులు మోహరించారు. దీంతో 21 మంది నిందితుల్లో ముద్దాయిగా ఉన్న ఏ సంజయ్, జి. చంద్రలను పోలీసులు అప్టటికే అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మరో ఏడుగురిని పోలీస్లు నిదితులుగా చేర్చారు.
Also Read: విజయ డెయిరీ వివాదంలో బిగ్ ట్విస్ట్.. చలసాని రాజీనామా వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!