Sonovision Showroom: తిరుపతి నగరంలో అర్ధరాత్రి వేళ ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూమ్లో భారీ చోరీ కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు పక్కా ప్లాన్తో వచ్చి.. రూ. కోట్ల విలువ చేసే ఖరీదైన మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఎత్తుకెళ్లారు.
అసలేం జరిగింది?
నగరంలోని కీలక ప్రాంతమైన అన్నమయ్య సర్కిల్లో ఉన్న సోనోవిజన్ మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ను దొంగలు టార్గెట్ చేశారు. ఎవరూ లేని సమయాన్ని చూసి షాప్లోకి చొరబడిన దుండగులు.. షోరూమ్లోని ఖరీదైన విభాగాన్ని ఊడ్చేశారు. ఇందులో ప్రధానంగా సుమారు 50 దాకా యాపిల్ ఫోన్లతో పాటు, ఇతర ప్రముఖ కంపెనీలకు చెందిన మరో 100 ఎలక్ట్రానిక్ మొబైళ్లను అపహరించారు. వీటితో పాటు మరికొన్ని విలువైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను కూడా పట్టుకెళ్లారు.
రూ. 2 కోట్ల మేర నష్టం!
చోరీకి గురైన ఫోన్లు, పరికరాల మొత్తం విలువ ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు రూ. 2 కోట్ల వరకు ఉంటుందని సదరు సంస్థ ప్రతినిధులు, పోలీసులు భావిస్తున్నారు. అంత పెద్ద మొత్తంలో ఖరీదైన ఐఫోన్లు మాయమవడంతో షాపు యజమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
Also Read: జగన్ అడుగేస్తే విధ్వంసం.. నోరు విప్పితే అబద్ధాలు: మంత్రి సవిత
రంగంలోకి పోలీసులు ..
విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్తో ఆధారాలు సేకరించారు. షోరూమ్లోని, అలాగే చుట్టుపక్కల వీధుల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని నిశితంగా పరిశీలిస్తున్నారు. దుండగులు ముందుగానే ప్లాన్ చేసి ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి, నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు వేగవంతం చేశారు.