TDP Government: రాష్ట్రప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని టీడీపీ మంత్రి నారాయణ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం పై ప్రజలందరు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు సుపరిపాలనను ప్రశంసిస్తున్నారని, అది చూసి వైసీపీ నాయకులు భరించలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.
అయితే మెగా డిఎస్సీ పై అనవసర రాద్ధాంతంను వైసీపీ నాయకుల చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలలో దాదాపుగా 16 వేల మంది ఉపాధ్యాయుల సంతోషాన్ని హరించాలని వైసీపీ నాయకుల చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక సైకోల్లా వ్యవహరిస్తున్నారన్నారు. వాళ్ళ తీరు మారకపోతే 2029 లో వైసీపీ గ్రాఫ్ జీరో కి పడిపోవడం ఖాయమని అన్నారు.
Also Read: ల్యాప్టాప్ను మించిన ఫీచర్లు.. బడ్జెట్ ధరలోనే, Amazon Saleలో దుమ్మురేపుతున్న ట్యాబ్లెట్లు ఇవే!
సర్వేపల్లి కాలువ కట్ట వాసుల సమస్య పరిష్కరిస్తామని మంత్రి హమీ ఇచ్చారు. భగత్ సింగ్ కాలనీ తరహాలోనే శాశ్వత ఇంటిపట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. 60 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న వాళ్ళనెవరిని ఇబ్బంది పెట్టము అని మంత్రి నారాయణ స్పష్ట్రం చేశారు. ఎన్జిటి నియమ నిబంధన ప్రకారం సర్వే చేయించి ప్రజలకు అన్యాయం జరుగకుండా చేస్తామని హమీ ఇచ్చారు.
Also Read: విజయవాడ సహా 15 రైల్వే స్టేషన్లకు మహర్దశ.. PPP మోడల్ లో రీడెవలప్మెంట్!