BigTV English

Jagan : ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు.. ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు..

Jagan : ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు.. ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు..


Jagan : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. మూడు రోజులుగా కడప జిల్లాలో సీఎం పర్యటిస్తున్నారు. మూడో రోజు పులివెందుల సీఎస్‌ఐ చర్చిను సందర్శించారు. అక్కడ
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ క్రిస్మస్‌ వేడుకలను జరుపుకున్నారు. చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ తోపాటు ఆయన తల్లి విజయమ్మ ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకలకు హాజరయ్యారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని పేర్కొన్నారు. మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారని వివరించారు. రాష్ట్ర ప్రజలకు కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు లభించాలని ఆకాంక్షించారు.


రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రజలు వేడుకులు చేసుకుంటున్నారు. క్రిస్మస్ సంబరాలతో అన్ని చర్చిల వద్ద సందడి వాతావరణం నెలకొంది.

Tags

Related News

Kurnool News: దేవరగట్టు కర్రల సమరంలో నెత్తురోడింది.. ముగ్గురు మృతి, 100 మందికి పైగా

AP GST Collections: ప‌న్నుల రాబ‌డిలో ప‌రుగులు తీస్తున్న ఏపీ.. సెప్టెంబ‌ర్ నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వ‌సూళ్లు

AP Heavy Rains: తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. ప్రజలు బయటకు రావొద్దు

Visakha Heavy Rains: వాయుగుండం ఎఫెక్ట్.. విశాఖలో భారీ వర్షాలు, గాలుల బీభత్సం

Kurnool News: దసరా ఫెస్టివల్.. రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం.. భారీగా ఏర్పాటు

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

Big Stories

×