E-Paper
Advertisement

Jagan : నేడు అనంతపురం జిల్లాకు జగన్.. వసతి దీవెన నగదు జమ చేయనున్న సీఎం..

Jagan : నేడు అనంతపురం జిల్లాకు జగన్.. వసతి దీవెన నగదు జమ చేయనున్న సీఎం..

Jagan : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. ఆ తర్వాత నార్పల క్రాస్ రోడ్డు వద్ద నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ వేదికపై నుంచే జగనన్న వసతి దీవెన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్ల నగదును సీఎం జగన్ జమ చేస్తారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటి వరకు 25,17,245 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.4,275.76 కోట్లు జమ చేసినట్లు అవుతుంది.

వసతి దీవెన పథకం కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఏటా రెండు విడతల్లో ప్రభుత్వం ఆర్ధికసాయం అందిస్తోంది. మెడిసిన్‌, ఇంజినీరింగ్, డిగ్రీ లాంటి ఉన్నత విద్యాకోర్సులు అభ్యసించే విద్యార్థులకు రూ.20 వేల చొప్పున అందిస్తోంది. పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు చొప్పున ఆర్థికసాయం చేస్తోంది.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×