Jagan : నేడు అనంతపురం జిల్లాకు జగన్.. వసతి దీవెన నగదు జమ చేయనున్న సీఎం..

Jagan : నేడు అనంతపురం జిల్లాకు జగన్.. వసతి దీవెన నగదు జమ చేయనున్న సీఎం..

CM Jagan's visit to Anantapur district today
Share this post with your friends

Jagan : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. ఆ తర్వాత నార్పల క్రాస్ రోడ్డు వద్ద నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ వేదికపై నుంచే జగనన్న వసతి దీవెన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్ల నగదును సీఎం జగన్ జమ చేస్తారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటి వరకు 25,17,245 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.4,275.76 కోట్లు జమ చేసినట్లు అవుతుంది.

వసతి దీవెన పథకం కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఏటా రెండు విడతల్లో ప్రభుత్వం ఆర్ధికసాయం అందిస్తోంది. మెడిసిన్‌, ఇంజినీరింగ్, డిగ్రీ లాంటి ఉన్నత విద్యాకోర్సులు అభ్యసించే విద్యార్థులకు రూ.20 వేల చొప్పున అందిస్తోంది. పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు చొప్పున ఆర్థికసాయం చేస్తోంది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Rahul Gandhi : సోనియా చెవిలో ఆ మహిళ చెప్పిన మాటేంటి..? బయట పెట్టిన రాహుల్..

Bigtv Digital

Congress news : కర్నాటకలో గృహలక్ష్మి పథకం ప్రారంభం.. కాంగ్రెస్ తగ్గేదేలే..

Bigtv Digital

Thummala Nageswara Rao : కాంగ్రెస్‌లోకి తుమ్మల?.. కేసీఆర్‌కు దిమ్మతిరిగే షాక్!

Bigtv Digital

Biden On Morbi Bridge Tragedy : మార్బీ బ్రిడ్జ్ దుర్ఘటనపై బైడెన్ దిగ్భ్రాంతి..

BigTv Desk

Tamanna bhatia : వాళ్లు అస‌లు ఇష్ట‌ప‌డ‌రంటూ…. స్టార్ హీరోల గుట్టు బ‌య‌ట‌పెట్టిన త‌మ‌న్నా!

Bigtv Digital

Pakistan: ముజాహిదీన్‌లను సృష్టించి తప్పుచేశాం.. వారే ఉగ్రవాదులయ్యారు: పాక్ మంత్రి

Bigtv Digital

Leave a Comment