E-Paper
Advertisement

Pulivendula ZPTC Councing: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ కౌంటింగ్.. 11 గంటలకు ఫలితం

Pulivendula ZPTC Councing: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ కౌంటింగ్.. 11 గంటలకు ఫలితం
Advertisement

Pulivendula ZPTC Councing: ఏపీలో ఖాళీ అయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఉప ఎన్నిక కౌంటర్ బుధవారం ఉదయం 8 గంటలకు మొదలైంది.  వాటిలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీతోపాటు పలు ప్రాంతాల్లో ఎంపీటీసీ సీట్లు ఉన్నాయి. కడప శివార్లలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ‌లో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు.

స్వయంగా జిల్లా కలెక్టర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పులివెందుల ఉప ఎన్నికల కౌంటింగ్ 10 టేబుళ్ళ ద్వారా మొదటి రౌండ్‌లో ఫలితం రావచ్చని అంటున్నారు. కేవలం 10 వేల ఓట్లు కావడంతో లెక్కింపు వేగంగా అవుతుందని అంటున్నారు. ఒంటిమిట్ట ళ కౌంటింగ్ ఫలితాలు 10 టేబుళ్ళ ద్వారా 3 వ రౌండ్‌లో ఫలితం తేలే అవకాశమున్నట్లు చెబుతున్నారు.

Advertisement

ఉదయం 10 లేదా 11 గంటలకు ఫలితాలు రావచ్చని అంటున్నారు. ఉప ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. కేవలం అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లను మాత్రమే లోపలికి అనుమతించనున్నారు. బుధవారం రెండు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ డిమాండ్ చేసింది.

చివరకు వాటిని రీపోలింగ్ ను బాయ్ కట్ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటన చేసింది. అయితే ఓటర్లు అవేమీ పట్టించుకోలేదు. ఈ.కొత్తపల్లి, అచ్చపల్లి గ్రామాల్లో బుధవారం జరిగిన రీ పోలింగ్‌కు ఓటర్లు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ ఓటును వినియోగించుకున్నారు. వర్షం కారణంగా ప్రారంభంలో తొలుత పోలింగ్ మందకొడిగా సాగింది.

Advertisement

ALSO READ: వరదలపై హైఅలర్ట్.. సీఎం చంద్రబాబు డైరెక్ట్ ఆర్డర్స్

మధ్యాహ్నానికి పోలింగ్ ఊపందుకుంది. అచ్చవెల్లిలో 68.50 శాతం, ఈ.కొత్తపల్లిలో 54.28 శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. పులివెందుల- ఒంటిమిట్ట జెడ్పీ సీట్లకు 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇదిలావుండగా తాము గెలుస్తామని అంచనా వేసిన అధికార పార్టీ, ఏర్పాట్లకు రెడీ అవుతోంది.

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఎన్నిక జరగడంతో గెలిస్తే భారీ ఎత్తున సంబరాలు చేయాలని ఆలోచన చేశారు టీడీపీ నేతలు.  ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీగా మోహరించారు.

Related News

ఏపీ గవర్నర్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..!

తిరుమల బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

తిరుపతి ప్రజలకు గుడ్ న్యూస్.. గ్రేటర్ మున్సిపల్‌గా తిరుపతి.. పెరిగిన డివిజన్లు!

విశాఖ పీఠంపై కూటమిలో టెన్షన్.. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య మేయర్ సీటు ఫైట్!

రోడ్లు, పార్కింగ్ కూడా ప్రభుత్వమే కట్టాలా? విశాఖ ఐటీ కంపెనీ వింత డిమాండ్లు!

వైసీపీ సవాల్‌కు సై.. పదింతలు పనిచేసి చూపిస్తా! మంత్రి నారాయణ మాస్ కౌంటర్

డీఎస్సీ, APPSC అక్రమాలపై CBI విచారణ జరపాల్సిందే.. మాజీ మంత్రి అంబటి డిమాండ్!

ఏపీలో షాకింగ్ ఘటన.. డ్యూటీలో ఉన్న ఎస్ఐ పై దాడి కలకలం!

Big Stories

Advertisement
×